తల్లికి వందనం నిధుల జమ.. ఆ రెండు రోజుల్లోనే.. చంద్రబాబు క్లారిటీ

Wait 5 sec.

ఆంధ్రప్రదశ్‌లోని పాఠశాలలు మరికొన్ని రోజుల్లో తెరుచుకోనున్నాయి. సెలవు రోజుల్లో సందడిగా గడిపిన విద్యార్థులు.. ఇక పుస్తకాల సంచితో బడిబాట పట్టాల్సిన సమయం వచ్చేసింది. సెలవు రోజులను సరదాగా గడిపేసిన చిన్నారులు.. కాస్త నిరాశతో బడికి బయల్దేరుతుంటే.. వారి తల్లిదండ్రుల ఆలోచనలు మాత్రం మరోలా ఉంటాయి. స్కూలు ఫీజులు, పుస్తకాల ఖర్చులు వంటి వాటి గురించే తల్లిదండ్రుల ఆలోచన.ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందించే తల్లికి వందనం సాయం కోసం చాలా మంది తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. వేన్నీళ్లకు చన్నీళ్లుగా ఈ సాయం.. తమకు కొంచెం ఉపశమనం కలిగిస్తుందనే ఆశతో ఉన్నారు. ఈ క్రమంలోనే తల్లికి వందనం నిధుల విడుదలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో చంద్రబాబు శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగానే తల్లికి వందనం సాయంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 12 లేదా 14వ తేదీలోపే చేస్తామని చంద్రబాబు నేతలకు తెలియజేశారు. అలాగే .. చేస్తామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు వివరించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.మరోవైపు వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రానికి కేంద్ర ఆక్సిజన్ అందిస్తోందన్న చంద్రబాబు.. అలాగని ప్రతిసారీ కేంద్రం వైపు చూడకుండా సొంతంగా నిలదొక్కుకోవాలన్నారు. రాష్ట్రంలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చామని.. వీటి ద్వారా 4.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చంద్రబాబు వివరించారు. 2027కి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. అలాగే రాజధాని అమరావతి నిర్మాణం కూడా వేగంగా జరువుతున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని.. ఈ క్రమంలోనే విశాఖ స్టేల్ ప్లాంట్‌కు రూ.11,400 కోట్ల ప్యాకేజీ, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పుతోందని చంద్రబాబు పార్టీ శ్రేణులకు వివరించారు.మరోవైపు పోలవరం బనకచర్ల అనుసంధానంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయన్న చంద్రబాబు.. దీని వలన తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగదన్నారు. వృథాగా కలిసే 3 వేల టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై కట్టిన ఏ ప్రాజెక్టును టీడీపీ వ్యతిరేకించలేదని.. కానీ కొందరు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.