అంతు పొంతూ లేకుండా పోతుంది. చిన్నా చితకా వాళ్లు, కంపెనీలే అనుకుంటే అప్పుడప్పుడూ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటాయి. తాాజగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు. కొత్త సెల్ ఫోన్ కోసం ఆత్రుతగా ఎదురు చూడసాగాడు. అతడి నిరీక్షణకు తెర దించుతూ పార్శల్ రానే వచ్చింది. ఇక ఎంతో సంతోషంగా పార్శల్ ఒపెన్ చేశాడు. మొబైల్ కోసం ఆశగా చూస్తున్న ఆ వ్యక్తి లోపల ఉన్న వస్తువులు చూసి బిత్తర పోయాడు. అసలేం జరిగిందంటే.. ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోన్ ఆర్డర్ చేయగా... సెల్ ఫోన్‌కు బదులుగా రెండు బట్టల సబ్బులు వచ్చిన ఘటన . నల్లబెల్లి మండలంలోని బుచ్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బానోత్ నర్సింహ.. తన కుమారుడు బానోతు రాజేందర్ కోసం ఓ ప్రైవేటు ఆన్‌లైన్ కేంద్రంలో రూ. 16 వేల విలువ గల మోటరోలా కంపెనీకి చెందిన సెల్ ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. గురువారం రాత్రి పార్శిల్ ఇంటికి వచ్చింది.అయితే పార్శల్ చూసిన రాజేందర్ తండ్రి నరసింహకు అనుమానం వచ్చింది. దీంతో ప్యాకింగ్ ఒపెన్ చేస్తూ వీడియో చిత్రీకరించారు. ప్యాకేజ్ తెరిచి చూడగా.. వారికి దానిలో మొబైల్ ఫోన్‌కు బదులుగా సంస్కారవంతమైన సోప్ అంటూ రెండు ట్రిపుల్ ఎక్స్ పది రూపాయలు సబ్బులు కనిపించాయి. వీటిని చూసి నరసింహ కంగు తిన్నాడు. వెంటనే కస్టమర్ కేర్‌కు కాల్ చేశాడు.తనకు జరిగిన మోసాన్ని ఫోన్ ద్వారా కంపెనీ నిర్వాహకులకు తెలియజేశాడు. అంతేకాక ఇలా ఎంత మందిని మోసం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాము పేదవారమని.. ఇలా చేయడం తగదని తెలిపాడు. నరసింహ ఫిర్యాదుపై స్పందించిన సదరు కంపెనీ ప్రతినిధులు.. వారం రోజుల్లోగా అతడి డబ్బులు తిరిగి చెల్లిస్తామని హమీ ఇచ్చారు. ఈక్రమంలో ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. పార్శల్ వచ్చిన సమయంలో దాన్ని ఒపెన్ చేస్తూ వీడియో తీయడం మంచిది అంటున్నారు నిపుణులు. మీరు ఆర్డర్ చేసిన దాంట్లో ఏవైనా లోపాలున్నా.. మిస్టేక్ జరిగినా కంపెనీని ప్రశ్నించే అవకాశం ఉండటంతో పాటుగా రీఫండ్ కూడా పొందవచ్చని.. నరసింహ అదే పని చేశాడని అంటున్నారు. అలానే ఆన్‌లైన్ మోసాలపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.