తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదాద్రి పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టను దర్శించుకుని.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం.. తిరుమలాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనను, ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నేతలను తీవ్ర స్థాయిలో విమర్శించారు. వల్లే కేసీఆర్‌ కాలు జారి పడ్డారని పరోక్షంగా ఆరోపణలు చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోనే తెలంగాణలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పేరును ‘యాదాద్రి’గా మార్చారని, తాము అధికారంలోకి వస్తే మళ్లీ పాత పేరుతోనే పునరుద్ధరిస్తామని గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు. చెప్పిన మాట ప్రకారం పేరు మార్పు చేశామని.. భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయ పనులను చేపడుతున్నామని వివరించారు. తన పుట్టినరోజు సందర్భంగా వేడుకలు చేసుకోకుండా.. మూసీ నది పరివాహక ప్రాంత ప్రజల కష్టాలను స్వయంగా పరిశీలించానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ దుస్థితిని చూసి చలించిపోయానని, అందుకే మూసీ ప్రక్షాళనను ఒక లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇచ్చిన మాట ప్రకారం పనులను మొదలుపెట్టామని స్పష్టం చేశారు. గుజరాత్‌లోని సబర్మతి, ఉత్తరప్రదేశ్‌లోని యమునా నదులను అభివృద్ధి చేసుకున్నప్పుడు, తమ మూసీని అభివృద్ధి చేసుకుంటే బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ‘తెలంగాణను అభివృద్ధి చేసుకోవద్దా..? మేము ఇంకా ఎంతకాలం ఈ మూసీ మురికిలో ఉండాలి?’ అని నిలదీశారు. గత పదేళ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నిస్తూ, బీఆర్‌ఎస్‌ను ‘దయ్యాల రాజ్య సమితి (డీఆర్‌ఎస్‌)’గా అభివర్ణించారు. అలాంటి ‘దయ్యాలను’ పొలిమేరల వరకు తరిమికొట్టేందుకు నల్లగొండ ప్రజల సహకారం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులందరినీ 50 వేలకు పైగా మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు. మొదటి నెల నుంచే ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందజేస్తున్నామని, గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందని నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేయొద్దని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి, తెలంగాణను ‘బొందలగడ్డ’గా మార్చినవారు ఇప్పుడు నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. తుర్కపల్లి మండలంలో 66 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా నిర్మించబోతున్న గంధమల్ల రిజర్వాయర్‌కు పునాది వేశారు. అలాగే.. ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్, వేద పాఠశాల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. కొలనుపాక-కాల్వపల్లి హైలెవల్ వంతెన, మోటకొండూరులో ఎంపీపీ, మండల కార్యాలయం, పోలీస్ స్టేషన్ భవనాలకు కూడా శంకుస్థాపన చేశారు.ఆలేరు నియోజకవర్గంలో మొత్తం రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు సోలార్ యూనిట్లు వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి వంటి ప్రముఖులు పాల్గొన్నారు.