మధ్యతరగతిపైనే కేంద్రం ఫోకస్.. కొత్త పెన్షన్, రూ. 12 లక్షల వరకు నో టాక్స్‌తో భరోసా..!

Wait 5 sec.

Income : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న మధ్యతరగతి కుటుంబాలకు.. కేంద్ర ప్రభుత్వం గట్టి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. రాబోయే నాలుగేళ్లలో ఈ వర్గంపై మరింత దృష్టి సారించనున్నట్లు వెల్లడించింది. మధ్యతరగతి వర్గానికి 'ఆర్థిక భద్రత' కల్పించడానికి ఉద్దేశించిన కీలక విధానాలను హైలైట్ చేసింది. ముఖ్యంగా 23 లక్షల మంది ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకం సహా రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపుతో పాటు స్మార్ట్ సిటీల వేగవంతమైన అభివృద్ధి వంటివి ఇందులో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.'మధ్యతరగతి కథ': భవిష్యత్తుకు భరోసా'ది మిడిల్ క్లాస్ స్టోరీ' పేరుతో విడుదల చేసిన ఈ ప్రకటన, దేశ వృద్ధిలో మధ్యతరగతి వర్గం కీలక పాత్ర పోషిస్తుందని నొక్కి చెప్పింది. పన్నులు, పెన్షన్, ద్రవ్యోల్బణం తగ్గింపు, కనెక్టివిటీ రంగాల్లో NDA ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేసిన వివిధ చర్యలను ఇందులో వివరించింది. ఈ విధానాలు మధ్య ఆదాయ కుటుంబాలు భవిష్యత్తును ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడానికి మెరుగ్గా సిద్ధం చేయడమే లక్ష్యంగా ఉన్నాయని పేర్కొంది.ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన కొత్త 'యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS).. దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. అర్హత, ప్రయోజనాలు: కనీసం 25 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులకు పదవీ విరమణకు ముందు చివరి ఒక సంవత్సరంలో పొందిన సగటు ప్రాథమిక వేతనంలో 50 శాతం పెన్షన్‌గా హామీ ఇస్తుంది. తక్కువ సర్వీస్ టెన్యూర్ ఉన్నవారికి (కనీసం 10 సంవత్సరాలు అర్హతతో), పెన్షన్ దామాషా ప్రకారం లెక్కించబడుతుంది, కనీసం నెలకు రూ. 10,000 హామీ పెన్షన్‌గా లభిస్తుంది.కుటుంబానికి రక్షణ: ఒక ఉద్యోగి మరణిస్తే, అతని కుటుంబానికి హామీ పెన్షన్‌లో 60 శాతం లభిస్తుంది.కవరేజ్: ఈ పథకం 2.3 మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మోడల్‌ను స్వీకరించాయి. దీని ద్వారా నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద ప్రస్తుతం ఉన్న 9 మిలియన్లకు పైగా వ్యక్తులకు ఇది విస్తరించనుంది.FY26 (2025-26 ఆర్థిక సంవత్సరం) కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఆదాయపు పన్ను ఉపశమనం.. జీతం పొందే కోట్లాది మంది పౌరులకు ప్రయోజనం చేకూరుస్తుంది. రూ. 12 లక్షల వరకు పన్ను లేదు అంటే సంవత్సరానికి రూ. 12 లక్షల వరకు సంపాదించే వ్యక్తులు ఇప్పుడు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, క్యాపిటల్ గెయిన్స్ వంటి ప్రత్యేక ఆదాయాలపై పన్ను వర్తిస్తుంది.రూ. 12.75 లక్షల వరకు కూడా పన్ను లేదు: రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్‌తో (ప్రామాణిక మినహాయింపు) కలిపి, సంవత్సరానికి రూ. 12.75 లక్షలు సంపాదించే వారు కూడా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటన పేర్కొంది. అంటే ఇక్కడ ఇది వేతన జీవులకు మాత్రమే వర్తిస్తుంది. "ఇది మధ్యతరగతి అవసరాలపై ప్రభుత్వం లోతైన అవగాహనకు అద్దం పడుతుంది. ప్రభుత్వం దాదాపు రూ. 1 లక్ష కోట్ల ఆదాయాన్ని వదులుకొని ఈ ప్రయోజనాన్ని అందిస్తోంది" అని ప్రకటనలో తెలిపింది.స్మార్ట్ సిటీస్ మిషన్: పట్టణీకరణలో వేగం'స్మార్ట్ సిటీస్ మిషన్' కూడా మధ్యతరగతి జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 2015లో ప్రారంభించిన ఈ పథకం కింద, 7,545 ఆమోదించిన ప్రాజెక్టుల్లో 93 శాతం ప్రాజెక్టులు 2025 నాటికి పూర్తయ్యాయని ప్రభుత్వం తెలిపింది. దీనికి మొత్తం రూ. 1.51 ట్రిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. స్మార్ట్ సిటీలు మెరుగైన మౌలిక సదుపాయాలు, రవాణా, జీవన సౌలభ్యాలను అందించడం ద్వారా మధ్యతరగతి జీవితాన్ని సులభతరం చేస్తాయి.