తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ

Wait 5 sec.

తెలంగాణలో జూన్ మొదటి వారంలో రికార్డు స్థాయి ఎండలతో అల్లాడింది. సాధారణంగా ఈ సమయానికి నైరుతి రుతుపవనాల కారణంగా వాతావరణం చల్లబడాల్సి ఉండగా.. ఈసారి మాత్రం ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. పగటి ఉష్ణోగ్రతలు చాలా జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. వేసవి కాలం ముగిసినా.. ముందస్తుగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినా.. ఎండల ప్రభావం కొనసాగడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ అందించిన తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ఉపరితల ద్రోణి బలపడటంతో.. తెలంగాణ వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.నేడు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, , మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇక గత రెండు రోజులుగా నగరంలో తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన హైదరాబాద్‌ వాసులకు శనివారం మధ్యాహ్నం కాస్త ఊరట లభించింది. ఉదయం నుంచి వేడి వాతావరణం కొనసాగగా.. కొండాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, మాదాపూర్, ఎర్రమంజిల్, లక్డీకపూల్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చాలా చోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని గమనించిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలు, నీరు నిల్వ ఉండే చోట్ల సహాయక చర్యలు చేపట్టారు.