రేవంత్ టీంలోకి కొత్త మంత్రులు.. ఆ ఎమ్మెల్యేకు జాక్‌పాట్, ఎవరూ ఊహించని విధంగా..!

Wait 5 sec.

తెలంగాణ అయింది. కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రేవంత్ టీంలోకి కొత్త మంత్రులు చేరనున్నారు. ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ముగ్గురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:00 నుండి 12:20 గంటల మధ్య కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. తాజా పెద్దపీట వేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. అందులో భాగంగా బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన పేర్లు ఖరారైనట్లు తెలిసింది. అయితే వీరులో శ్రీహరి, వివేక్ పేర్లు ముందు నుంచి వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఇక గడ్డం వివేక్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉండగా.. మంత్రి పదవి హామీతోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన పలు ధపా చర్చల్లోనూ వివేక్ పేరు మంత్రి పదవుల రేసులో ప్రముఖంగా వినిపించింది. అయితే ఎవరూ ఉహించని విధంగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది. మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని గత కొన్ని రోజులుగా ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఖర్గే వంటి జాతీయ స్థాయి నేతల్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. మంత్రివర్గంలో తమ వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ శనివారం కూడా ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తమ వర్గానికి తగినన్ని టికెట్లు దక్కలేదని.. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అవకాశం రాలేదని వారు ముఖ్యమంత్రితో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజికవర్గం నుండి తప్పనిసరిగా ఒకరికి చోటు కల్పించాలని వారు సీఎంను అభ్యర్థించినట్లు తెలిసింది. దీంతో అనుహ్యంగా అడ్లూరి లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది. ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009-2011 మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. తాజాగా.. మంత్రి వర్గంలో చోటు దక్కించుకోబోతున్నారు. ఇలా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా జాక్‌పాట్ దక్కించుకుంటున్నారు.