పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినచురుకుగా సాగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పైలట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తి చేసుకొని, గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు. నిధుల విడుదలపై మంత్రి కీలక అప్డేట్ ఇచ్చారు. జూన్ 2- జూన్ 9 వరకు ఈ వారానికి సంబంధించి లబ్ధిదారులకు రూ.22.64 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వారం రోజుల్లోనే 1,549 ఇళ్లు బేస్‌మెంట్ వరకు, 481 ఇళ్లు గోడల నిర్మాణం వరకు, మరో 117 ఇళ్లు స్లాబ్ వరకు పూర్తయ్యాయని వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం, తల తాకట్టుపెట్టయినా సరే ప్రతి సోమవారం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు బేస్‌మెంట్ వరకు 9,877 ఇళ్లు, గోడల వరకు 1,839 ఇళ్లు, స్లాబు పూర్తయినవి 388 ఇళ్లు ఉన్నాయన్నారు. వీటికి మొత్తం రూ.98.64 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో ప్రభుత్వ పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని, నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం చేపట్టడం లేదని మంత్రి స్పష్టం చేశారు. లబ్ధిదారులు తమ స్థలానికి అనుగుణంగా, తమకు ఇష్టమైన రీతిలో 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకునే సౌలభ్యాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు.ఇంజినీర్లకు మంత్రి సూచనలురాష్ట్రంలో దాదాపు 250 మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని మంత్రి తెలిపారు. లబ్ధిదారులకు ఇంజినీర్లు నిర్మాణ పనుల్లో తగిన సహకారాన్ని అందించాలని, వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా లబ్ధిదారులను ప్రోత్సహించాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఇది తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని, పేదల సొంతింటి కలను నిజం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. విడతల వారీగా రాష్ట్రంలోని మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.