కోనసీమ: తహసీల్దార్‌పై కొడవలితో దాడి.. నిందితుడెవరో తెలిసి అందరూ అవాక్కు

Wait 5 sec.

Man Attacked Tehsildar With Sickle : తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో దారుణం జరిగింది. విధుల్లో ఉన్న మహిళా తహసీల్దార్‌పై ఓ వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. దీంతో ఆమె చేతికి గాయం అయింది. అక్కడున్న సిబ్బంది అతడిని బయటకు లాక్కువచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తొత్తరమూడి శివారు జోగిరాజుపాలెంకు చెందిన మీసాల సత్యనారాయణ అనే వ్యక్తి.. శుక్రవారం సాయంత్రం కార్యాలయంలో సిబ్బంది ఉండగానే అయినవిల్లి తహసీల్దార్ కార్యాలయంలోకి హఠాత్తుగా వచ్చాడు. అనంతరం తన సంచిలో దాచి ఉంచిన కొడవలిని తీసి తహసీల్దార్‌పై నాగలక్ష్మమ్మపై విసిరాడు. ఈ దాడిలో తహసీల్దార్ చేతికి గాయమైంది. ఈ క్రమంలో అక్కడున్న కార్యాలయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై దాడిని చేసిన వ్యక్తిని బయటకు లాక్కువచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడి చేసిన క్రమంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని సిబ్బంది తెలిపారు. నిందితుడుడు సత్యనారాయణ.. తనకు తొత్తరమూడిలో కొబ్బరి తోటలు ఉన్నాయని.. వాటిని ఎవరో ఆక్రమించారని, తనకు భూపత్రాలు ఇప్పించాలని అమలాపురంలో కలెక్టర్ కార్యాలయం, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటాడని స్థానికులు తెలిపారు. అతడు కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని చెబుతున్నారు. అప్పుడప్పుడు మద్యం తాగి రోడ్డుపై కేకలు వేస్తూ తిరుగుతాడని చెప్పారు. గతంలో ఒక నేరంలో జైలుకు కూడా సత్యనారాయణ వెళ్ళి వచ్చాడని తెలుస్తోంది.మరోవైపు సత్యనారాయణకు గ్రామంలో ఎటువంటి భూములు లేవని తహసీల్దార్ నాగలక్ష్మమ్మ చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొత్తపేట ఆర్డీవో శ్రీకర్.. తహసీల్దార్‌ను పరామర్శించారు.జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా ఈ ఘటనపై స్పందించారు. తహసీల్దార్‌పై మారణాయుధంతో దాడిచేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆయన తహసీల్దార్‌ నాగలక్ష్మమ్మతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. జిల్లా యంత్రాంగం ఆమెకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దాడి చేసిన వ్యక్తిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఎస్పీకి సూచించారు.