లలితా జువెలరీ పబ్లిక్ ఇష్యూ.. ఏకంగా రూ.1700 కోట్లు.. సెబీకి దరఖాస్తు!

Wait 5 sec.

IPO: డబ్బులు ఎవరికీ ఊరికే రావు. ధరలు పోల్చి చూసి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే కొనండీ అనే డైలాగులు ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యాయి. ఏ టీవీ ఛానల్ చూసినా ప్రకటనల్లో ఈ డైలాగులు చెప్తూ ఓ గుండు అంకుల్ కనిపిస్తారు. ఆయనే లలితా జువెలరీ మార్ట్ ఓనర్ కిరణ్ కుమార్.ఇప్పుడు మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది లలితా జువెలరీ. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అడుగు పెట్టనుంది. త్వరలోనే తొలి పబ్లిక్ ఆఫర్ ()కు రానుంది. ఇందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) వద్ద ప్రాథమిక పత్రాలు ఫైల్ చేసింది. ఈ పత్రాల ప్రకారం రూ.1200 కోట్లు విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తుండగా.. ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద రూ.500 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తోంది. ఈ సంస్థ ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ రూ.500 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. చెన్నై ప్రధాన కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోన్న లలితా జువెలరీ మార్ట్ దక్షిణాది రాష్ట్రాల్లోని వివిధ ప్రధాన నగరాల్లో 56 రిటైల్ స్టోర్లు కలిగి ఉంది. 2022- 24 మధ్య ఈ సంస్థ ఆదాయం ప్రతి సంవత్సరం 43.62 శాతం చొప్పున పెరిగింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరిం రూ. 1700ల కోట్లలో కొత్తగా 12 స్టోర్లు ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే ఇతర కార్పొరేట్ అవసరాలకు కేటాయిస్తామని తెలిపింది. ఇష్యూ తర్వాత ఈక్విటీ షేర్లు బీఎస్ఈ‌తో పాటు ఎన్ఎస్ఈలోనూ నమోదు కానున్నాయి. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఆనంద్ రాఠీ అడ్వైజర్స్, ఈక్విరస్ కేపిటల్ వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రార్ గా ఎంయూఎఫ్‌జీ ఇన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరిస్తోంది. మరోవైపు.. ఇప్పటికే దేశీయ మార్కెట్లలో ప్రముఖ జువెలరీ సంస్థలు టైటాన్ ఇండియా, పీసీ జువెలర్స్, కళ్యాణ్ జువెలర్స్, పీఎన్ గాడ్గిల్ జువెలర్స్, టీబీజడ్ జువెలర్స్, తంగమలై జువెలర్స్ వంటివి లిస్టయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలో లలితా జువెలర్స్ మార్ట్ చేరుతోంది. సెబీ నుంచి అనుమతులు రాగానే పబ్లిక్ ఇష్యూ వేగవంతం కానుంది. లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసే ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశంగా చెబుతారు.