పెట్టేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సాంకేతికత సాయంతో వాహనదారుల ఇబ్బందులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అస్త్రం యాప్‌ను ప్రారంభించారు. విశాఖపట్నం వాసిగా ట్రాఫిక్ కష్టాలను తాను ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించాలనే ఉద్దేశంతో.. పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండేలా యాప్ తేవాలని ఆలోచించినట్లు వంగలపూడి అనిత చెప్పారు. ఈ క్రమంలోనే అస్త్రం యాప్ తీసుకువచ్చినట్లు వంగలపూడి అనిత వెల్లడించారు. మూడు నెలల్లోగా అస్త్రం యాప్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఈ యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే విశాఖ వాసులకు తప్పినట్టే..*మరోవైపు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సైతం ఇప్పటికే అస్త్రం యాప్‌ను ప్రారంభించారు. విజయవాడ వాసులను ట్రాఫిక్ కష్టాల తప్పించేందుకు అస్త్రం యాప్‌ను గతేడాది అక్టోబర్ నెలలో ప్రారంభించారు. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ (ASTraM) పేరుతో పైలెట్ ప్రాజెక్టు కింద విజయవాడలో ఈ యాప్ అందుబాటులోకి తెచ్చారు. డ్రోన్లు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా.. ట్రాఫిక్ పోలీసులకు వాహనాల రాకపోకలపై సమాచారం అందిస్తూ.. ట్రాఫిక్ రద్దీని నియంత్రించనున్నారు. అస్త్రం యాప్‌ను హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఆర్కాడిస్‌తో కలిసి రూపొందించారు. గూగుల్ మ్యాప్స్, మై మ్యాప్స్, ఓలా, ఉబర్ నుంచి అస్త్రం యాప్.. ట్రాఫిక్ అప్‌డేట్‌ల సమాచారాన్ని సేకరిస్తుంది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా రియల్ టైమ్‌లో ట్రాఫిక్ సిబ్బందిని అలర్ట్ చేస్తుంది. ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడితే.. ట్రాఫిక్ పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో చేరుకుని.. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేలా దీనిని రూపొందించారు. ఒకవేళ ట్రాఫిక్ సమస్య పెద్దగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలను ప్లాన్ చేసుకోవడానికి వీలుగా వాహనదారులకు.. వాహనాలు ఎన్ని కిలోమీటర్ల మేర నిలిచిపోయాయనే వివరాలను ఈ యాప్ చేరవేస్తుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యేక బృందం ట్రాఫిక్ కదలికలను పర్యవేక్షిస్తూ.. ట్రాఫిక్‌కు తగిన విధంగా గ్రౌండ్ లెవల్ సిబ్బందిని అప్రమత్తం చేస్తుందని అధికారులు చెప్తున్నారు.