: షేర్ హోల్డర్లకు శుభవార్త. ప్రతిష్టాత్మక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) అయిన బజాజ్ ఫైనాన్స్, తమ పెట్టుబడిదారులకు భారీ బహుమతిని ప్రకటించింది. , స్టాక్ స్ప్లిట్‌కు (షేర్ల విభజన) కూడా సిద్ధమైంది. ఈ కీలక నిర్ణయాల కోసం రికార్డు తేదీని కూడా ఖరారు చేసింది. జూన్ 6న ప్రకటించిన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, జూన్ 16, 2025న స్టాక్ స్ప్లిట్, బోనస్ షేర్ల ఇష్యూకు అర్హులైన షేర్ హోల్డర్లను గుర్తించడానికి రికార్డు తేదీగా బజాజ్ ఫైనాన్స్ నిర్ణయించింది. శుక్రవారం ట్రేడింగ్‌లో బజాజ్ ఫైనాన్స్ షేరు 5 శాతం పెరిగి రూ. 9,372 వద్ద ముగిసింది.కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఇలా పేర్కొంది. 'ప్రస్తుత ఈక్విటీ షేర్ల ఉప-విభజన, కంపెనీ బోనస్ ఈక్విటీ షేర్ల జారీకి అర్హులైన సభ్యులను నిర్ణయించే ఉద్దేశ్యంతో, కంపెనీ జూన్ 16, 2025, సోమవారంను 'రికార్డు తేదీ'గా నిర్ణయించిందని తెలియజేస్తున్నాము."బజాజ్ ఫైనాన్స్ స్టాక్ స్ప్లిట్, బోనస్ ఇష్యూ 2025 వివరాలు..1. స్టాక్ స్ప్లిట్ (షేర్ల విభజన): 1:2 నిష్పత్తిఏప్రిల్ 29న చేసిన మరో ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ బోర్డు 2:1 నిష్పత్తిలో స్టాక్ స్ప్లిట్‌ను ఆమోదించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రూ. 2 ముఖ విలువ గల ప్రతి ఒక్క షేరును, రూ. 1 ముఖ విలువ గల రెండు పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లుగా విభజించబడుతుంది. ఉదాహరణకు, మీ వద్ద రూ. 2 ముఖ విలువ గల 1 బజాజ్ ఫైనాన్స్ షేరు ఉంటే, స్టాక్ స్ప్లిట్ తర్వాత అది రూ. 1 ముఖ విలువ గల 2 షేర్లుగా మారుతుంది. షేర్ల సంఖ్య రెట్టింపు అవుతుంది, అయితే మొత్తం పెట్టుబడి విలువ స్ప్లిట్‌కు ముందు ఉన్నదానికంటే పెద్దగా మారదు.2. బోనస్ షేర్ జారీ: 4:1 నిష్పత్తిస్టాక్ స్ప్లిట్ తర్వాత, అంటే రూ. 1 ముఖ విలువ గల షేర్లు ఏర్పడిన తర్వాత, బజాజ్ గ్రూప్ కంపెనీ 4:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీని కూడా ప్రకటించింది. దీని ప్రకారం.. మీ వద్ద ఉన్న ప్రతి ఒక పూర్తిగా చెల్లించిన రూ. 1 ముఖ విలువ గల ఈక్విటీ షేరుకు, 4 (నాలుగు) బోనస్ ఈక్విటీ షేర్లు (ప్రతి షేరు రూ. 1 ముఖ విలువతో) ఉచితంగా లభిస్తాయి. అంటే, మీ వద్ద స్ప్లిట్ తర్వాత ఒక షేరు ఉంటే, మీకు అదనంగా 4 షేర్లు ఉచితంగా లభిస్తాయి. మొత్తం షేర్ల సంఖ్య 5 అవుతుంది.ఒక ఉదాహరణతో స్పష్టత..మీ వద్ద రికార్డు తేదీకి ముందు రూ. 2 ఫేస్ వాల్యూ గల 1 బజాజ్ ఫైనాన్స్ షేరు ఉందని అనుకుందాం. స్టాక్ స్ప్లిట్ తర్వాత (1:2): మీ వద్ద రూ. 1 ముఖ విలువ గల 2 షేర్లు ఉంటాయి. బోనస్ షేర్ల జారీ తర్వాత (4:1): ఈ 2 షేర్లకు గాను, మీకు 2 x 4 = 8 ఉచితంగా లభిస్తాయి.మొత్తంగా, మీరు రూ. 2 ముఖ విలువ గల ఒకే షేరుకు బదులుగా, రూ. 1 ముఖ విలువ గల 2 (స్ప్లిట్) + 8 (బోనస్) = మొత్తం 10 షేర్లను కలిగి ఉంటారు. ఇది షేర్ హోల్డర్లకు గణనీయమైన లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంది.కంపెనీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతి షేరుకు రూ. 44 (ముఖ విలువ రూ. 2కి 2200 శాతం) తుది డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ మే 30. మార్చి త్రైమాసికంలో, కంపెనీ ఏకీకృత నికర లాభంలో 19 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి రూ. 4,545.6 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం (NII) అంచనాల కంటే కొద్దిగా తక్కువగా రూ. 9,807.1 కోట్లుగా నమోదైంది.ముఖ్య గమనిక: ఈ వార్త కేవలం అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి ధ్రువీకరించిన ఆర్థిక నిపుణులను సంప్రదించండి.