ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆ ఇద్దరే టీమిండియా ఓపెనర్లుగా రావాలి: రికీ పాంటింగ్

Wait 5 sec.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ పలికిన తర్వాత టీమిండియా తొలి టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. అడుగుపెట్టింది. జూన్ 20న ప్రారంభం కానుంది. ఇక రోహిత్, కోహ్లీ టెస్టులకు దూరం కావడంతో వారి ప్లేసులను భర్తీ చేసే ఆటగాళ్లెవరు? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఓపెనర్ రోహిత్ శర్మ ప్లేసులో జైశ్వాల్‌తో కలిసి ఎవరు ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారని తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చాలా మంది చేయాలని అభిప్రాయపడుతున్నారు. కానీ పాంటింగ్ మాత్రం కొత్త ప్లేయర్ సాయి సుదర్శన్‌ను జైశ్వాల్‌కు జోడీగా పంపాలని సూచించాడు. అందుకు గల కారణాన్ని సైతం పాంటింగ్ చెప్పుకొచ్చాడు.“యంగ్ బ్యాటర్‌ క్లాస్, టెక్నిక్‌ ఉన్న ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అతడు జైశ్వాల్‌తో ఓపెనింగ్ చేస్తాడని నేను భావిస్తున్నా. సుదర్శన్ టెస్టుల్లో కచ్చితంగా రాణిస్తాడని అనుకుంటున్నా. ఓపెనర్లుగా ఇద్దరు యువ ఆటగాళ్లు ఉంటే మూడో స్థానంలో అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ లేదా కరుణ్‌ నాయర్‌ను ఆడించేందుకు వీలు ఉంటుంది. ఇదే జరిగితే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయం గిల్‌కు మేలు చేస్తుంది. ఇంగ్లాండ్ సిరీస్‌లో భారత టాప్-5 బ్యాటర్లలో సుదర్శన్, యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్‌ గిల్, కరుణ్ నాయర్ ఉండొచ్చు” అని ఓ ఇంటర్వ్యూలో రికీ పాంటింగ్ అన్నాడు.కాగా ఇంగ్లాండ్‌కు బయలుదేరే ముందే జట్టు కూర్పుపై కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జూన్ 13న ప్రారంభమయ్యే టీమిండియా ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌పై మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్‌ లయన్స్‌తో జరుగుతున్న అనధికారిక రెండో టెస్టులో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీ చేయడం గమనార్హం.