నగరంలో మరో మూడు ఫ్లై ఓవర్‌లు..ఇక ఆ ప్రాంతాల్లో నోట్రాఫికర్.. రయ్‌మంటూ దూసుకెళ్లొచ్చు

Wait 5 sec.

హైదరాబాద్‌ని విశ్వ నగరంగా అభివృద్ధి చేసి.. ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం కోసం మౌలిక వసతులను డెవలప్ చేయడం కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అలానే నగరంలో ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (హెచ్‌-సిటీ)ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నగరం మొత్తం మీద 16 ప్రాంతాల్లో 20.14 కిలోమీటర్ల మేర రూ.2400 కోట్లతో వంతెనలు, అండర్‌పాస్‌లు, రహదారుల విస్తరణ పనులకు సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించనున్నారు. ఈప్రాజెక్ట్‌లో భాగంగా భాగ్యనరంలో విపరీతంగా రద్దీ ఉండే మూడు ప్రాంతాల్లో రెడీ అవుతోంది. మరి ఆ ప్రాంతాలు ఏవి అంటే.. సిటీలో.. వాహనాల రద్దీతో విపరీతమైన ట్రాఫిక్ ఉండే మూడు జంక్షన్లకు పరిష్కారం లభించబోతోంది. రేవంత్ ప్రభుత్వం హెచ్‌-సిటీ ప్రాజెక్టు కింద రూ.360 కోట్లతో నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ఈక్రమంలో జీహెచ్‌ఎంసీ ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇంతకు ఆ ఏరియాలు ఏవి అంటే.. బంజారహిల్స్‌ రోడ్డు నం.3లోని ది లీలా హోటల్‌ జంక్షన్, పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ (ఎన్‌ఎఫ్‌సీఎల్‌)లో నిర్మాణం చేపట్టబోయే ఫ్లైఓవర్‌ల కోసం రూ.210 కోట్లు కేటాయించింది. అలానే రసూల్‌పుర ఎన్టీఆర్‌ చౌరస్తాపై.. బేగంపేట మెయిన్ రోడ్డును, మినిస్టర్‌ రోడ్డును కలుపుతూ నిర్మించబోయే ఫ్లైఓవర్‌కు గాను రూ.150 కోట్ల ఖర్చవతుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి కాగానే.. టెండర్లు పిలుస్తామని చెప్పుకొచ్చింది. ఈ ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తే.. ఈ మూడు ప్రాంతాల్లో లభించనుంది అంటున్నారుఎన్‌ఎఫ్‌సీఎల్‌ చౌరస్తాలో నిర్మించబోయే ఫ్లైఓవర్ పొడవు నిర్మాణం 900 మీటర్లు. ఈ నిర్మాణ పనుల కోసం 13 ఆస్తులను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. బంజారహిల్స్‌ రోడ్డు నం.1 నుంచి నాగార్జున సర్కిల్‌ మీదుగా రోడ్డు నం.3 వైపు వెళ్లే వాహనాల కోసం రెండు లైన్ల ఫ్లైఓవర్ రానుంది. దీని పొడవు 900మీటర్లు. అలానే పంజాగుట్ట నుంచి బంజారహిల్స్‌ రోడ్డు నం.3 మీదుగా శ్రీనగర్‌కాలనీకి రెండు లైన్ల అండర్‌పాస్ రాబోతుంది. దీని పొడవు 340 మీటర్లు. వీటితో పాటుగా కేబీఆర్‌ పార్కు నుంచి పంజాగుట్ట వైపు లీలా హోటల్‌ జంక్షన్‌ వద్ద మూడు లైన్ల ఫ్లైఓవర్ రానుంది. దీని పొడవు 600 మీటర్లు. ఈ రెండు నిర్మాణ పనుల కోసం 46 ఆస్తులను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలానే బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డుకు వెళ్లే దారిలో.. ఎన్టీఆర్‌ జంక్షన్‌లో మెట్రో మార్గం మీదుగా ఫ్లైఓవర్‌ని నిర్మించబోతున్నారు. దీని పొడవు 740 మీటర్లు.. ఇందుకోసం 8 ఆస్తులను సేకరించాల్సి ఉంది. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ భూసేకరణపై క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేపట్టారు.