ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేస్కోండి

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. డ్వాక్రా మహిళల పిల్లల చదువు కోసం ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టింది. సెర్ప్ ఆధ్వర్యంలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తారు. ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా పేరు పెట్టాలని అధికారులు ప్రతిపాదించారు. ఇది కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. స్త్రీనిధి నుంచి తీసుకున్న రుణాన్ని పిల్లల చదువు కోసమే ఉపయోగించాలి. ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం కొనుగోలు చేయొచ్చు. సాంకేతిక విద్యకు కూడా ఈ డబ్బును ఉపయోగించవచ్చు. ఊరి నుంచి దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సైకిల్ కొనుక్కోవడానికి కూడా అనుమతి ఉంది. డబ్బును దేనికోసం ఖర్చు చేశారో రసీదులు స్త్రీనిధి అధికారులకు ఇవ్వాలి.ఏపీ ప్రభుత్వంకు 4% వడ్డీకే రుణాలు ఇవ్వనుంది. స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం తీసుకోవచ్చు. పిల్లల చదువుకు భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం స్త్రీనిధి డ్వాక్రా సభ్యులకు 11% వడ్డీతో రుణాలు ఇస్తోంది. అయితే, పిల్లల చదువు కోసం వడ్డీ రేటును తగ్గించారు. తల్లిదండ్రులు ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రుణాన్ని వాయిదాల రూపంలో చెల్లించవచ్చు. తీసుకున్న మొత్తాన్ని బట్టి కనీసం 24 నెలల నుంచి గరిష్టంగా 36 నెలల వరకు గడువు ఉంటుంది. ఈ పథకం కోసం ఏడాదికి రూ.200 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రుల చేతిలో డబ్బులు లేక బయట ఎక్కువ వడ్డీలకు తెచ్చి అప్పులపాలవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం.. వారికి చేయూతగా నిలిచేందుకు కొత్త పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో 138 అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు రూ.11.52 కోట్లు విడుదలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. పీఎం జన్‌ మన్‌ పథకంలో భాగంగా .. ఒక్కో కేంద్రాన్ని రూ.12 లక్షలతో నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలందించేందుకు ఈ చర్యలు చేపట్టింది.