తెలంగాణ వెదర్ అప్డేట్స్.. నేడు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయా..?

Wait 5 sec.

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపిస్తుండగా.. పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. సోమవారం (జూన్ 9) పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. మంగళవారం (జూన్ 10) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక గత 24 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల్, వరంగల్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదైనట్లు టీజీడీపీఎస్‌ (తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ) వెల్లడించింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు ఈసారి కొద్దిగా ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీని ఫలితంగా మే చివరి వారంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి, వాతావరణం చల్లబడింది. కానీ ఆ తర్వాత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా రెయిన్ అలర్ట్‌తో ప్రజలకు ఉపశమనం కలగనుంది. అయితే వర్షాలత ోపాటుగా భారీగా ఈదురుగాలులు, పిడుగులు పడే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు.