ఏపీలో టీచర్లకు శుభవార్త.. కౌన్సిలింగ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

Wait 5 sec.

కీలక నిర్ణయం తీసుకుంది. సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ)ల బదిలీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌జీటీ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో మ్యాన్యువల్ విధానం అనుసరించాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ .. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటించారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ప్రజాప్రతినిధులు, టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్‌తో ఎస్జీటీ కౌన్సిలింగ్‌పై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు తనకు తెలియజేసినట్లు చెప్పారు. వారి విజ్ఞప్తి మేరకు ఎస్జీటీలకు ఆన్‌లైన్ కౌన్సిలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు నారా లోకేష్ వెల్లడించారు.ఉపాధ్యాయుల బదిలీలలో వెబ్ కౌన్సిలింగ్ బదులుగా మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఏపీలోని ఉపాధ్యాయులు గత కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అదివారం నుంచి నిరసనలు కూడా ఉద్ధృతం చేశారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ విధానంలో కాకుండా ఎస్టీటీ కౌన్సిలింగ్ మ్యాన్యువల్ విధానంలో చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు. మరోవైపు పార్వతీపురంలో జరిగిన లో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. SGT ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియలో మాన్యువల్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. వెబ్ కౌన్సిలింగ్‌ విధానంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని నారా లోకేష్‌కు వివరించారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయుల నిరసనలకు కారణాలు..ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ విధానం పట్ల ఉపాధ్యాయులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల మాన్యువల్ కౌన్సెలింగ్‌ను కోరుతూ నిరసనలు చేపట్టారు. ఆన్‌లైన్ విధానంలో సీనియారిటీ ఆధారంగా వేలాది స్కూళ్ల నుంచి ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని, ఇది ఆచరణీయం కాదని చెప్తున్నారు. ఒక్క చిన్న తప్పు కూడా తమ కెరీర్‌ను నాశనం చేయవచ్చని చెప్తున్నారు. మ్యాన్యువల్ విధానంలోనే బదిలీలు చేపట్టాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరాహార దీక్షలు, డైరెక్టరేట్ ముట్టడి వంటి ఆందోళనలకు పిలుపునిచ్చారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తోంది.. మరోవైపు ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్ విధానంతోనే ఉపాధ్యాయులకు మేలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చెప్తోంది. ఆన్‌లైన్ బదిలీల ప్రక్రియలో రాజకీయ జోక్యం, పైరవీలకు స్థానం ఉండదని చెప్తోంది. ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపాకే బదిలీ చట్టం అమల్లోకి తెచ్చినట్లు తెలిపింది. అయితే ఉపాధ్యాయుల నిరసనలతో నిర్ణయం మార్చుకుంది.