తల్లిదండ్రులు లేకుండా జీవించడం ఎంత కష్టమో అనుభవించే వారికే తెలుస్తుంది. బంధువులు ఎందరున్నా.. ఎంత బాగా చూసుకున్నా.. కన్నవారి ప్రేమకు సాటి రాదు. మరీ ముఖ్యంగా ఆడపిల్ల జీవితంలో కొన్ని ప్రత్యేక సందర్బాలుంటాయి. ఆడపిల్లకు తొలి పిరియడ్ ప్రారంభం అయినప్పుడు మన సమాజంలో దాన్నో పండుగలాగా చేసుకుంటారు. పదిమందిని పిలిచి తమ బిడ్డకు ఆశీర్వాదాలు ఇప్పిస్తారు. ఆ సమయంలో తల్లిదండ్రి ఉంటే ఆ బిడ్డకు ఎంత ధైర్యంగా ఉంటుందో చెప్పలేం. అలాంటి ప్రత్యేక సందర్బంలో లేకపోతే ఎంత బాధగా ఉంటుందో కదా. ఇప్పుడు మనం చెప్పుకొబోయే బాలిక పరిస్థితి కూడా ఇదే. ఆ చిన్నారి ఐదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు మృతి చెందారు. ఇక తాజాగా బాలికకు ఓణీల ఫంక్షన్ నిర్వహించారు బంధువులు. ఇక ఈ వేడుకకు చనిపోయిన తల్లిదండ్రులు.. స్వర్గం నుంచి విచ్చేసి.. తమ బిడ్డను ఆశీర్వదించారు. వారిని చూసి ఆ బాలిక గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. మరి చనిపోయిన తల్లిదండ్రులు ఎలా ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు అనే వివరాలు మీ కోసం.., మారుతీనగర్‌కు చెందిన మనస్విక అనే బాలిక తల్లిదండ్రులు చిన్నారికి ఐదేళ్ల వయసులోనే చనిపోయారు. అప్పటి నుంచి బంధువులే బాలికను చేరదీశారు. ఇక తాజాగా మనస్వికకు ఓణీల ఫంక్షన్ నిర్వహించారు. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులు పక్కనే ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. కానీ మనస్వికకు ఆ అవకాశం లేదు. చిన్నారి మనసులో బాధ అలానే ఉంది. అయితే విషయం అర్థం చేసుకున్న బంధువులు కొందరు.. మనస్విక తల్లిదండ్రులు ఈ ఫంక్షన్‌లో సందడి చేసేలా చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఏఐ సాయం తీసుకున్నారు. ప్రస్తుతం మన జీవితంలో . ఫొటోలు, వీడియోలతో మాయ చేస్తుంది. ప్రతి రంగంలోనూ ఏఐ దూసుకుపోతుంది. ఈ క్రమంలో మనస్విక బంధువులు కూడా ఏఐ సాయంతో.. చిన్నారి తల్లిదండ్రులు వచ్చి.. ఫంక్షన్‌లో సందడి చేసినట్లుగా.. బిడ్డను అక్కున చేర్చుకుని.. ఆశీర్వదించినట్లుగా.. తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగినట్లుగా వీడియో క్రియేట్ చేశారు. దీన్ని ఫంక్షన్ హాల్లో ప్రదర్శించారు.తనకు ఊహ తెలియక ముందే చనిపోయిన అమ్మానాన్నలు.. ఇప్పుడు ఇలా తన ఫంక్షన్‌లో కనిపించడం చూసి ఆ బాలిక గుండె సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. నిజంగానే తన కోసం అమానాన్నలు స్వర్గం నుంచి దిగి వచ్చారు.. తనతో మాట్లాడారు.. తన పక్కనే కూర్చుని ఉన్నట్లుగా ఫీల్ అయ్యింది. ఊహ తెలియని వయసులో దూరమైన తల్లిదండ్రులను.. ఇలా వీడియోలో చూసి గుక్కపట్టి ఏడ్చింది. నిజంగానే ఆ దేవుడు తన కోసం తన అమ్మానాన్నలను తిరిగి పంపించాడనుకుంది. ఇక మనస్వికతో పాటుగా బంధువులంతా వీడియోని చూసి కన్నీటిపర్యంతం అయ్యారు. నిజంగానే ఇప్పుడా దంపతులుంటే.. తమ బిడ్డను ఇంకెంత బాగా చూసుకునేవారో కదా.. ఎంత సంతోషించేవారో కదా అనుకుని బాధతో విలవిల్లాడారు. అప్పటి వరకు సందడిగా, కోలాహలంగా ఉన్న వేదిక కాస్త.. ఈ వీడియోని చూసిన తర్వాత గంబీర వాతావరణంలోకి మారింది. ఎవరిని కదిలించినా.. కంట కన్నీరు తప్ప నోటి నుంచి మాట రాని మూగవాళ్లయ్యారు. మనస్విక జీవితంలో ఇంత ముఖ్యమైన వేడుక వేళ నిజంగానే చిన్నారి తల్లిదండ్రులను తీసుకువచ్చిన ఏఐ టెక్నాలజీని మెచ్చుకున్నారు.