ఎర్ర సముద్రంలో కలకలం.. జర్మనీ యుద్ధ విమానంపై చైనా నౌక లేజర్ దాడి

Wait 5 sec.

ఎర్ర సముద్రంలో గస్తీ తిరుగుతోన్న తమ యుద్ధ విమానంపై చైనా లేజర్ దాడికి పాల్పడినట్టు జర్మనీ సంచలన ఆరోపణలు చేసింది. యూరోపియన్ యూనియన్ ASPIDES మిషన్‌లో భాగంగా గగనతల పర్యవేక్షణ చేపట్టిన ఫైటర్ జెట్‌ను యుద్ధ నౌకను నుంచి లేజర్‌తో లక్ష్యంగా చేసుకుందని జర్మనీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. దీనిపై బెర్లిన్‌లో ఉన్న చైనా రాయబారిని సమన్లు జారీ చేస్తూ, తీవ్ర దౌత్యపరమైన నిరసన వ్యక్తం చేసింది. ఈచర్యను సర్వసాధారణంగా అంగీకరించలేని పనిగా జర్మన్ విదేశాంగ శాఖ అభివర్ణించింది. ఈ చర్యతో సైనికుల ప్రాణాలు, ఆపరేషనల్ భద్రతకు ముప్పు ఏర్పడిందని మండిపడింది. ఏస్పైర్డ్స్ (ASPIDES) మిషన్‌లో భాగంగా రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ వంటి హైరిస్క్ జలాల్లో పౌర నౌకల రక్షణ కోసం గగనతలంలో గస్తీ నిర్వహిస్తోంది. ఈ నెల ప్రారంభంలో చైనా యుద్ధ నౌక లేజర్‌ దాడి చేసినట్టు అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. దీంతో జర్మనీ యుద్ధ విమానం మిషన్‌ నుంచి అర్థాంతరంగా వైదొలగి, జిబౌటికు సురక్షితంగా చేరుకుంది. ‘ఈ చర్యతో మనుషుల ప్రాణాలే కాకుండా, పరికరాలకూ ప్రమాదం ఏర్పడింది’ అని జర్మన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించారు.ASPIDES మిషన్ లక్ష్యంఐరోపా సమాఖ్య ఆధ్వర్యంలోని ASPIDES మిషన్ , గల్ఫ్ ఆఫ్ ఏడెన్, హిందూ మహాసముద్రంలో పౌర నౌకల రక్షణే లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవలి కాలంలో యెమెన్ హౌతీ రెబల్స్ దాడులతో ఈ ప్రాంతం అత్యంత సున్నితంగా మారింది. ఇటీవల లైబీరియా జెండా గల ఓ కంటైనర్ నౌకపై హౌతీలు భీకర దాడి చేశారు.అటు, ఈ ఘటనపై ఇప్పటివరకు చైనా నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు. బెర్లిన్‌లో చైనా రాయబార కార్యాలయం, చైనా విదేశాంగ శాఖ మౌనం పాటిస్తున్నాయి. అయితే, ఈ ఘటనతో అంతర్జాతీయ జల నిబంధనలపై తీవ్ర సందేహాలు మొదలయ్యాయి. లేజర్ దాడి వంటి చర్యలు, స్పష్టమైన శత్రుత్వ సంకేతాలు కాకపోయినా, సమాంతరంగా ఉన్న శాంతి బలగాలకు ముప్పుగా మారవచ్చు. ఐరోపా సమాఖ్య ఇప్పుడు ASPIDES మిషన్ ప్రోటోకాల్స్‌ను ముఖ్యంగా చైనా వంటి అంతర్జాతీయ శక్తుల సమీపంలో కార్యకలాపాలు సాగించేటప్పుడు పునఃపరిశీలించాల్సిన అవకాశం ఉంది.