తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు.. ఈ మార్గాల్లోనే, తుది దశకు డీపీఆర్‌లు

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ రైల్వే వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా డోర్నకల్ - గద్వాల, డోర్నకల్ - మిర్యాలగూడ మధ్య కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఆగస్టు నెలాఖరుకు డీపీఆర్‌లు రైల్వే బోర్డుకు చేరే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు.డోర్నకల్ - గద్వాల కీలకమైనదిగా భావిస్తున్నారు. ఈ కొత్త రైల్వే మార్గం సుమారు 296 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నిర్మాణానికి సుమారు రూ. 5,330 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. హైదరాబాద్ - విజయవాడ రైల్వే లైన్‌లోని డోర్నకల్‌ను, హైదరాబాద్ - బెంగళూరు రైల్వే మార్గంలోని గద్వాలతో కలుపుతుంది. ఇది కేవలం రెండు కీలక మార్గాలను అనుసంధానించడమే కాకుండా, ఇప్పటివరకు రైల్వే వసతి లేని అనేక ముఖ్యమైన పట్టణాలకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలను కలుపుతుంది. కూసుమంచి, పాలేరు, మోతె, సూర్యాపేట, భీమారం, తిప్పర్తి, నల్గొండ, కనగల్, చండూరు, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి, బూత్‌పూర్ వంటి ప్రధాన ప్రాంతాల మీదుగా సాగనుంది. ఈ మార్గం కోసం ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) మంజూరై, సర్వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు ప్రస్తుతం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) దశలో ఉంది. ఈ మార్గం కోసం టోకెన్ కింద రూ. 7.40 కోట్లు కూడా విడుదల చేశారు. తుది సర్వే పూర్తయ్యాక వ్యయంపై మరింత స్పష్టత వస్తుంది. కూడా తెలంగాణలోని పలు ప్రాంతాలకు రైల్వే అనుసంధానాన్ని పెంచనుంది. ఈ రైల్వే లైన్ సుమారు 97 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ లైన్ నిర్మాణానికి సుమారు రూ. 2,160 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. డోర్నకల్ - గద్వాల, కరీంనగర్ - హసన్‌పర్తి లైన్లతో కలిపి మొత్తం మూడు ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 7,840.37 కోట్లుగా నిర్ణయించారు. డోర్నకల్ జంక్షన్ నుంచి కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మీదుగా మిర్యాలగూడ వరకు ఈ మార్గం ఉంటుంది. ఇది గుంటూరు-బీబీనగర్ లైన్‌కు అనుసంధానించబడుతుంది. దీనివల్ల ఆయా ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అంచనా.ఈ రెండు కొత్త రైల్వే లైన్లు తెలంగాణలోని రైల్వే నెట్‌వర్క్‌ను గణనీయంగా పెంచనున్నాయి. మారుమూల ప్రాంతాలకు రైలు సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయి. అలాగే, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు కూడా ఇవి ఊతమిచ్చి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి.