విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన బంగారం బ్యాంకుకు చేరింది. కనకదుర్గమ్మకు చెందిన 29.510 కిలోల బంగారాన్ని గాంధీనగర్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచ్‌లో డిపాజిట్‌ చేశారు.. ఇవి 22 క్యారెట్ల బంగారు నగలు. ఈ బంగారం డిపాజిట్‌ (చాలా కాలంగా స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచిన వివిధ రకాల నగలను గోల్డ్‌ మేనిటైజేషన్‌ స్కీమ్‌ కింద) ఏడాదికి 0.60 శాతం వడ్డీ వస్తుందని దుర్గగుడి ఈవో శీనానాయక్‌ తెలిపారు. 'బ్యాంకులో డిపాజిట్‌ చేసిన .. గ్రాము రూ.9,010 రేటు చొప్పున దాదాపు రూ.26.58 కోట్లు ఉంటుంది. దుర్గమ్మ ఆలయానికి సంబంధించి దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పల్లంరాజు, పర్యవేక్షకుడు సుబ్రహ్మణ్యం, నగల నిర్ధారణ అధికారి, దుర్గ గుడి ఏఈవోలు చంద్రశేఖర్, రమేష్‌బాబు తదితరుల సమక్షంలో బంగారాన్ని బ్యాంకు అధికారులకు అప్పగించాము. సోమవారం నాటి బంగారం ధరలను ఇంటర్‌నెట్‌లో పరిశీలించి ఆ మేరకు విలువ కట్టి బ్యాంకుకు అప్పగించాము. పకడ్బందీ భద్రతా ఏర్పాట్ల నడుమ బ్యాంకులో నగలను అందజేశాము' అన్నారు. మరోవైపు తొలి ఏకాదశి సందర్బంగాలో రద్దీ పెరిగింది. ఆదివారం భక్తులతో ఇంద్రకీలాద్రిపై కిటకిటలాడింది. ఒకవైపు క్యూలైన్లలో రద్దీ ఉండగా.. మరోవైపు పెద్దసంఖ్యలో మహిళలు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించేందుకు తరలివచ్చారు. విజయవాడ గుడ్ న్యూస్. తమ పేర్లను నమోదు చేసుకోవడానికి రాజగోపుర ప్రాంగణంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, త్వరలో ఆన్‌లైన్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో శీనానాయక్ తెలిపారు. గుడిలో భక్తులకు అన్నప్రసాదం, క్యూలైన్లు, సామాన్లు భద్రపరిచే గదులు వంటి వాటి దగ్గర సేవ చేసే అవకాశం ఉంది. ఆర్జిత సేవలు,సమాచార కేంద్రం, ప్రసాదాల కౌంటర్లు, ఉచిత బస్సు, పార్కింగ్ దగ్గర కూడా సేవకులుగా పనిచేయవచ్చు. ఈ సేవలో పాల్గొనే భక్తులకు దర్శనం, వసతి, భోజన సదుపాయాలు గుడి నిబంధనల ప్రకారం ఉంటాయి. దీని గురించి ఈవో శీనానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. టోల్‌ ఫ్రీ నంబరు 1800 425 9099కు ఫోన్ చేసి మరిన్ని వివరాల తెలుసుకోవచ్చన్నారు. గుడిలో సేవ చేయాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అన్నారు. మరోవైపు దుర్గమ్మ ఆలయానికి సోలార్ పవర్ పనుల్లో పురోగతి పై ఈవో శీనా నాయక్ చర్యలు చేపట్టారు. నెట్ మీటర్ ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని ఏపీసీపీ డీసీఎల్ చైర్మన్ ఎండీ పొగాకు పుల్లారెడ్డి ఈవోకు హామీ ఇచ్చారు. త్వరలోనే ఆలయానికి సోలార్ పవర్ ద్వారా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.