అమెరికాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం సజీవదహనమైంది. నగరంలోని సుచిత్రకు చెందిన శ్రీవెంకట్ (40), తేజస్విని (36) దంపతులు కాగా.. వారి ఇద్దరు పిల్లలు సిద్ధార్థ (9), మృదా (7)లతో కలిసి సెలవులకు అమెరికాలోని డల్లాస్‌ వెళ్లారు. అక్కడి నుంచి అట్లాంటాలోని సోదరి ఇంటికి కారులో వెళ్లి తిరిగి డల్లాస్‌ వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.గ్రీన్ కౌంటీ వద్ద రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ మినీ ట్రక్కు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. కారులో మంటలు చెలరేగి నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు పూర్తిగా కాలి బూడిదైపోయింది. పోలీసులు డీఎన్‌ఏ నమూనాలను సేకరించి, మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ దుర్ఘటన శ్రీవెంకట్ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న శ్రీవెంకట్, తేజస్వినిల వివాహం 2013లో జరిగింది. ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టి జీవితంలో ఇప్పుడెప్పుడే స్థిరపడుతున్న సమయంలో అనుకోని ప్రమాదం వారి ఆశలను బూడిద చేసింది. వారి మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు బంధువులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ప్రమాదాలు, అనారోగ్యం, ఇతర కారణాలతో మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఫిలిప్పీన్స్‌లో ఒక తెలుగు వైద్య విద్యార్థి గుండెపోటుతో మృతి చెందడం కూడా ఇలాంటి దురదృష్టకర సంఘటనలలో ఒకటి. పుట్టిన రోజు నాడే ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నత చదువులు, మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు వెళ్తున్న తెలుగు వారికి ఇలాంటి విషాదాలు చోటు చేసుకోవడం వారి వారి కుటుంబాల్లో తీవ్ర ఆవేదనను నింపుతోంది. విదేశాల్లో ఉంటున్న వారు, వెళ్లేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రమాణాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలియని ప్రదేశాలకు వెళ్లటం, ఈత రాకపోయిన స్విమ్మింగ్ ఫూల్‌లలోకి దిగటం, డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.