గోడ తీస్తే 3.. మూస్తే 8 కి.మీ.. అడ్డుగోడపై 'హైడ్రా' కొరడా, 25 వేల మందికి ఊరట

Wait 5 sec.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మోపుతోంది. ఇప్పటికే వందల ఇండ్లు, నిర్మాణాలను నేలమట్టం చేసింది. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు హైడ్రా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నగరంలోని పలు గేటెడ్ కమ్యూనిటీలు, ప్రైవేట్ వెంచర్లు నిబంధనలకు విరుద్ధంగా వల్ల ప్రజలు దీర్ఘకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కాలనీల్లో అడ్డగోడలను కూల్చివేసి, దారులు లేని ప్రాంతాలకు రోడ్లు నిర్మిస్తోంది. తాజాగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండలంలోని మల్లంపేట- బాచుపల్లి మధ్య నెలకొన్నిచూపింది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఎగ్జిట్ 4 నుంచి మల్లంపేట, బాచుపల్లి క్రాస్‌రోడ్స్ మీదుగా ప్రగతినగర్‌కు చేరుకోవడానికి ఉన్న సులభమైన మార్గానికి అనే కాలనీ నివాసులు అడ్డుగా గోడ కట్టడంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.వాస్తవానికి ORR ఎగ్జిట్ నుంచి ప్రగతినగర్‌కు కేవలం 3 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. అయితే ప్రణీత్ ఆంటిల్యా కట్టిన అడ్డుగోడ కారణంగా సుమారు 25,000 మందికి పైగా ప్రజలు 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. మల్లంపేట గ్రామ ప్రజలతో పాటు, ప్రణీత్ లీఫ్ కాలనీ, ఆకాష్ వెంచర్, డ్రీం వ్యాలీ కాలనీ, గ్రీన్‌పార్కు కాలనీ, సాయినగర్ కాలనీ, బృందావన్ కాలనీ, ఏపీఆర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, లక్ష్మి శ్రీనివాస్ కాలనీ, HMDAతో పాటు మరిన్ని కాలనీల వాసులు ఈ అడ్డుగోడ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. గోడ తొలగిస్తే 40 నుంచి 60 అడుగుల వెడల్పుతో కూడిన దారి లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. గతంలో ఈ ప్రాంతం గుండా బండ్ల బాట ఉండేదని స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ప్రణీత్ ఆంటిల్యా నివాసులు మాత్రం తమ కాలనీ గుండా రాకపోకలు పెరిగితే ఇబ్బందులు పడతామని, తమకు గోస మొదలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన హైడ్రా... లోతైన పరిశీలన చేసింది. HMDA అనుమతులు పరిశీలించగా.. ప్రణీత్ ఆంటిల్యా గేటెడ్ కమ్యూనిటీ కాదని స్పష్టమైంది. HMDA అనుమతుల్లో 7వ అంశం ప్రకారం.. నివాస ప్రాంతాలకు చుట్టూ ప్రహరీ నిర్మించరాదని, ముఖ్యంగా రహదారులకు అడ్డంగా గోడలు నిర్మించరాదని, పక్కన ఉన్న కాలనీవాసులకు దారి చూపాలని స్పష్టంగా ఉంది.ఈ నిబంధనల ఆధారంగా హైడ్రా ఇటీవల అక్కడి ప్రహరీలను తొలగించింది. అయితే ప్రణీత్ ఆంటిల్యా కాలనీ వాసుల అభ్యంతరాలతో మరింత లోతుగా అధ్యయనం చేసింది. రెవెన్యూ అధికారులు కూడా ప్రణీత్ ఆంటిల్యా నివాసాల మధ్య నుంచే గతంలో బండ్ల దారి ఉండేదని ధృవీకరించారు. నిజాంపేట మున్సిపల్ అధికారులు కూడా ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదని నిర్ధారించారు. దీంతో హైడ్రా, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఇరుపక్షాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రణీత్ ఆంటిల్యా గేటెడ్ కమ్యూనిటీ కాదని, దారి ఇవ్వాల్సిందేనని స్పష్టంగా నిర్ణయించారు. ఈ నిర్ణయంతో మల్లంపేట ప్రజల ఏళ్ల నాటి పోరాటానికి న్యాయం దొరికింది.