బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి భారీ విరాళం.. బాలకృష్ణకు చెక్కు అందజేత, ఎంతంటే.. ఆ ఊరి వాళ్లకు ఉచితంగా వైద్యం

Wait 5 sec.

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భారీ విరాళం ఇచ్చింది. నాట్స్ అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించిన 8వ తెలుగు సంబరాల్లో నందమూరి బాలకృష్ణ దంపతులకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ఈ సంబరాల ముగింపులో రూ.85 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌) ఛైర్మన్‌ మన్నవ మోహనకృష్ణ, నాట్స్‌ సభ్యులు ఈ విరాళం చెక్కును బాలకృష్ణకు అందజేశారు. ఎన్టీఆర్ గ్లోబల్ లిటరేచర్ కమిటీ రూపొందించిన ‘శక పురుషుడు’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినిమా ఇండస్ట్రీ నుంచి జయసుధ, మీనా, శ్రీలీల వంటి సినీ నటులను సత్కరించారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, సీనియర్ హీరో వెంకటేశ్, ఏపీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, గౌతు శిరీష, వసంత కృష్ణప్రసాద్, చదలవాడ అరవిందబాబులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.మరోవైపు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచింది. గ్రామంలో కేసులు బయటపడటంతో బసవతారకం ఆసుపత్రి వైద్యులు గ్రామాన్ని సందర్శించి ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బసవతారకం ఆస్పత్రి డాక్టర్ల కృష్ణప్రసాద్, సునీల్ టాండన్ బలభద్రపురం వెళ్లి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడారు. బలభద్రపురం సమస్య గురించి తాను అసెంబ్లీలో ప్రస్తావించానని.. ఆ వెంటనే ప్రభుత్వం సర్వే చేయించింది అన్నారు ఎమ్మెల్యే నల్లిమిల్ల. 1,298 మందికి పరీక్షలు చేస్తే 67 మందికి పాజిటివ్‌గా అనుమానిస్తున్నారని చెప్పుకొచ్చారు.ఈ క్యాన్సర్ కేసుల అంశం సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణికి తెలిసి ఆమె స్వయంగా బసవతారకం ఆస్పత్రి సీఈవో కృష్ణయ్యతో మాట్లాడారన్నారు. ఆ వెంటనే సీఈవో ఇద్దరు డాక్టర్లను పంపారని.. ఊరిలో అందరికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారన్నారు.. ఒకవేళ ఎవరికైనా వ్యాధి ఉంటే బసవతారకం ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తారని తెలిపారు. అలాగే ఆరోగ్యవంతమైన బలభద్రపురాన్ని చూడటమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే నల్లిమిల్లి. క్యాన్సర్ సాధారణంగా మూడు, నాలుగు దశలకు వచ్చే వరకు తెలియదన్నారు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి డాక్టర్ కృష్ణప్రసాద్. అప్పుడు చికిత్స చేసినా ఫలితం ఉండదన్నారు. బలభద్రపురం ప్రజల ఆరోగ్యానికి బసవతారకం ఆసుపత్రి సహాయం చేయడానికి ముందుకు రావడంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. అంతేకాదు ఇటీవల బలభద్రపురంలో పీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య పర్యటించారు.. పరిశ్రమలపై ఆరా తీశారు. బలభద్రంపురంలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి.. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది.. ఊరిలో ప్రజలకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి కూడా అండగా నిలిచింది.