ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా పీఎం కిసాన్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ పథకానికి అర్హుల జాబితాను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది.. ఈ మేరకు అర్హుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ఒకవేళ అర్హుల జాబితాలో పేరు లేనివారు రైతు సేవా కేంద్రంలో అర్జీలు అందజేయొచ్చన్నారు వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు. అంతేకాదు అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని గ్రీవెన్స్ మాడ్యూల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఈ ఫిర్యాదులు అందజేందుకు ఈ నెల 13వరకే అవకాశం ఉంటుందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెలలోనే రూ.7వేలు రైతుల బ్యాంక్ అకౌంట్‌లలో జమ కానున్నాయి.రైతులు సంబంధించిన పోర్టల్‌, మన మిత్ర వాట్సాప్‌లో ఆధార్‌ నంబర్‌ ద్వారా అర్హత ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఈ మేరకు మన మిత్ర వాట్సప్‌ నంబర్‌ 95523 00009కు ఆధార్‌ నంబర్‌ను పంపితే వివరాలు వస్తాయి. ఒకవేళ అర్హుల జాబితాలో రైతు పేరు లేకపోతే.. అర్హత ఉందని భావిస్తే రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు అవసరమైన పత్రాలు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే రైతులు అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని గ్రీవెన్స్‌ మాడ్యూల్‌లో కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఈనెల 13 ఫిర్యాదు చేయొచ్చని.. ఈ సమాచారం రైతులకు వివరించాలని ఉద్యోగులు ముమ్మర ప్రచారం చేయాలి అన్నారు వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కూడా సూచించారు. రైతులు అర్హుల జాబితాలో పేరు లేకపోతే వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పీఎం కిసాన్ పథకాలను కలిపి అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది.. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 20 వేలు ఇస్తారు. కేంద్రం రూ. 6 వేలకు.. ఏపీ ప్రభుత్వం రూ. 14 వేలు కలిపి రూ.20వేలు అందజేస్తారు.ఈ డబ్బును మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ నెలలోనే మొదటి విడత డబ్బు విడుదల కానుంది. చిన్న రైతులు, కౌలు రైతులు ఈ పథకం ద్వారా లాభం పొందుతారు. పీఎం కిసాన్ డబ్బు విడుదల చేసే సమయంలోనే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలలోనే ఏపీ రైతులకు డబ్బులు విడుదల చేయాలని నిర్ణయించారు.. ఈనెలలో తొలి విడత కింద రూ.7వేలు చొప్పున అకౌంట్‌లలో జమ చేయనున్నారు.