తెలంగాణ రైతాంగానికి సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. . కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి ఖరీఫ్ సీజన్‌లో యూరియా కొరత లేకుండా చూడాలని కోరారు. తెలంగాణకు సరిపడా యూరియాను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన , తెలంగాణ రైతులకు అవసరమైన యూరియాను అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.తెలంగాణలో యూరియా ఎరువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని కేంద్ర మంత్రికి తెలిపారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగినంత యూరియా సరఫరా చేయాలని ాయన కోరారు. విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ రైతుల డిమాండ్‌ను నెరవేర్చేందుకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.ఢిల్లీలో మీడియాతో జేపీ నడ్డా మాట్లాడుతూ... రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల భూ సారం తగ్గిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీని గురించి తెలంగాణ ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలిపారు. 2023-24 రబీ సీజన్‌తో పోలిస్తే 2024-25లో 21 శాతం యూరియా అమ్మకాలు పెరిగాయని ఆయన వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 12.4 శాతం వినియోగం పెరిగిందని చెప్పారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వాడకుండా చూడాలని నడ్డా సూచించారు. ప్రత్యామ్నాయ ఎరువులు వినియోగం, సేంద్రీయ వ్యవసాయం ద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గించవచ్చని అన్నారు. దీనికోసం PM PRANAM పథకం గురించి తెలంగాణ అధికారులకు వివరించారు. ఈ విషయాన్ని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రంజిత్ కుమార్ మిశ్రా తెలియజేశారు. రాష్ట్రంలోని జిల్లాల మధ్య ఎరువుల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులను జేపీ నడ్డా ఆదేశించారు. రైతులందరికీ ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.