: కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వాటాను విక్రయించనుంది. పెట్టుబడుల ఉపసంహరణ విభాగం దీనిపై వేగంగా పనిచేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వార్తల నేపథ్యంలో గురువారం ట్రేడింగ్ సెషన్‌లో 2 శాతానికి పైగా పడిపోయింది. కేంద్రానికి ప్రస్తుతం ఎల్‌ఐసీలో 96.5 శాతం వాటా ఉంది. 2022 మే నెలలో ఐపీఓలో (IPO) భాగంగా కేంద్రం 3.5 శాతం వాటాను విక్రయించింది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ. 902-949గా అప్పట్లో నిర్ణయించారు. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 21 వేల కోట్లు సమకూరాయి.తాజా సమాచారం ప్రకారం, ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి ఈ చర్చలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడుల ఉపసంహరణ విభాగం ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది.షేర్ పతనం ఎందుకు?గురువారం ట్రేడింగ్ సెషన్‌లో ఎల్‌ఐసీ షేర్ ధర 2 శాతానికిపైగా తగ్గింది. కిందటి సెషన్‌లో రూ. 946 వద్ద స్థిరపడగా.. గురువారం రోజు రూ. 937 వద్ద ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో 2.50 శాతానికిపైగా నష్టంతో రూ. 921 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 2.02 శాతం నష్టంతో రూ. 926.90 వద్ద ముగిసింది. ప్రభుత్వం ఓఎఫ్‌ఎస్ ద్వారా వాటాలను విక్రయించబోతోందని వార్తలు రావడంతోనే.. షేర్ ధర పడిపోయింది. గత ఆరు నెలల్లో ఎల్‌ఐసీ షేర్ 10 శాతం పెరిగింది. అయితే, గత సంవత్సరం వ్యవధిలో దాదాపు 11 శాతం తగ్గింది.ఎంత వాటా విక్రయిస్తారు?సెబీ నిబంధనల ప్రకారం.. 2027 మార్చి 16 నాటికి పబ్లిక్ షేర్ హోల్డింగ్‌ను 10 శాతానికి పెంచాలి. ఇందులో భాగంగా కేంద్రం మరో 6.5 శాతం వాటాను విక్రయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎల్‌ఐసీ మార్కెట్ విలువ దాదాపు రూ. 6 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో కేవలం 1 శాతం వాటాను విక్రయించినా, ప్రభుత్వానికి రూ. 6,000 కోట్లు సమకూరవచ్చని నివేదిక పేర్కొంది.తదుపరి రెండు సంవత్సరాలలో అనేక దశలలో 6.5 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీని వల్ల సెబీ కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ అవసరాలను తీర్చడం షేర్ విక్రయాలను సులభతరం చేయడం జరుగుతుంది. అయితే, ఎంతమేర వాటా విక్రయిస్తారు? ఎంత ధరకు విక్రయిస్తారు? ఎప్పుడు విక్రయిస్తారు? అనే వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.