అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.. నారా లోకేష్‌కు బహూకరించిన చిత్రపటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సోషల్ మీడియా వేదికగా ఏపీ బీజేపీ చీఫ్ చేసిన పనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీవీఎన్ మాధవ్ ఏపీ బీజేపీ చీఫ్‌గా కొత్తగా నియమితులయ్యారు బుధవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఉండవల్లిలోని నివాసంలో లోకేష్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారతదేశ చిత్రపటాన్ని మాధవ్ నారా లోకేష్‌కు అందజేశారు. భారతదేశ సాంస్కృతిక వైభవం పేరుతో ఉన్న చిత్రపటాన్ని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్.. నారా లోకేష్‌కు అందజేశారు. అయితే ఈ చిత్రపటంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను వేర్వేరుగా కాకుండా.. కలిపి ఆంధ్రప్రదేశ్‌గా చూపించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే .. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్వీట్ చేశారు. ఏపీ బీజేపీ చీఫ్ చేసిన పనికి భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. "సాంస్కృతిక గుర్తింపు, చరిత్రలో సరైన స్థానం, భౌగోళిక గుర్తింపు కోసం తెలంగాణ ప్రజానీకం కొన్ని తరాలు పోరాటం చేసింది. కానీ ఈరోజు, మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను బహుమతిగా ఇచ్చి, తెలంగాణ ఉనికిని విస్మరించారు. దీని ద్వారా మా పోరాటాన్ని తక్కువ చేశారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ పోరాటానికి, అమరవీరుల త్యాగాలు, చరిత్ర పట్ల స్పష్టమైన నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. మా చరిత్రను తుడిచేస్తే, ఇక మేం ఏమిటి?" అంటూ ప్రధానమంత్రి నరేంద్ర చేశారు. ఈ ఘటన బీజేపీ పార్టీ ప్రణాళికను తెలియజేస్తోందా లేదా రాజకీయ ఎజెండాను ప్రతిబింబిస్తుందో స్పష్టం చేయాలని ప్రధానమంత్రి మోదీని కేటీఆర్ కోరారు. తెలంగాణ అస్థిత్వాన్ని, తెలంగాణ భౌగోళిక గుర్తింపును గుర్తించకపోవటం బీజేపీ విధానమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ ఇదే కనుక పొరబాటున జరిగి ఉంటే.. తెలంగాణ ప్రజలను అపహాస్యం చేసినందుకు బీజేపీ అధిష్టానం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ కేటీఆర్‌ ట్వీట్‌ ద్వారా డిమాండ్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ ఫోటో వైరల్ అవుతోంది.