గురుపౌర్ణమి రోజు పున్నమి చంద్రుని దర్శనం చేసుకున్నా.. చంద్రబాబును చూసి మహిళ ఎమోషనల్

Wait 5 sec.

ఏపీ ముఖ్యమంత్రి నారా నాయుడు గురువారం శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించారు. సత్యసాయి జిల్లా కొత్తచెరువు జిల్లాపరిషత్ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం -2.0 ( మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0) కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. లో చంద్రబాబుతో పాటుగా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఓ మహిళ సీఎం చంద్రబాబు నాయుడును చూసి ఎమోషనల్ అయ్యారు. తల్లికి వందనం పథకం, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో చంద్రబాబు పేదవారికి అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆ తర్వాత చంద్రబాబు కాళ్లకు నమస్కరించారు. రాష్ట్రంలోని అందరి తల్లుల తరుఫున.. తాను చంద్రబాబు కాళ్లకు నమస్కరిస్తున్నానంటూ ఎమోషనల్ అయ్యారు. రోజున పున్నమి చంద్రుని దర్శనం చేసుకున్నానంటూ సంతోషపడ్డారు. ముఖ్యమంత్రి ముందు మాట్లాడాలని ఎంతో ప్రిపేర్ అయ్యి వచ్చానని.. కానీ ఏమీ మాట్లాడలేకపోతున్నానని క్షమించండి సార్ అంటూ ఆ మహిళ భావోద్వేగానికి గురయ్యారు.మరోవైపు గురువారం (జూలై 10) రెండు తెలుగు రాష్ట్రాలలో గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ పర్వదినం విశిష్టతను గుర్తులో పెట్టుకునే ఏపీ ప్రభుత్వం కూడా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ఈ రోజు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే కొత్తచెరువు జిల్లాపరిషత్ పాఠశాలలరో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు, నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలనే తన ఆలోచన ఇప్పటిది కాదని అన్నారు. 1998లోనే ఈ ఆలోచన చేశానని గుర్తు చేసుకున్నారు. స్కూళ్లల్లో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నవారు.. తాము చదువుకున్న స్కూళ్లకు ఎంతో కొంత తిరిగివ్వాలని చంద్రబాబు సూచించారు. తల్లీ, తండ్రి తర్వాతి స్థానం గురువులదని.. జీవితంలో ఎవరిని మరిచిపోయినా, విద్యాబుద్ధులు చెప్పిన గురువులను మాత్రం మరిచిపోలేమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజకీయాలలో బిజీగా ఉన్నందున నారా లోకేష్ చిన్నప్పుడు ఎప్పుడూ కూడా తాను పేరెంట్స్‌ మీటింగ్‌కు వెళ్లలేకపోయానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పిల్లలను బాగా చదివించుకోవాలనే ఉద్దేశంతోనే తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్న చంద్రబాబు.. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కడ చదివించినా, వారి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విద్యార్థులకు స్కూళ్లకు వస్తున్నారో లేదో తెలుసుకునేందుకు యాప్ తెచ్చామని.. స్కూలుకు రాకపోతే తల్లిదండ్రులకు వెంటనే తెలిసిపోతుందన్నారు. నెలకొల్పామని చంద్రబాబు ప్రకటించారు.