గత రెండు రోజులుగా ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. మంగళవారం రోజున ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తర్వాత.. అనేక ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, బీజేపీ పెద్దలు అమిత్ షా, బీఎల్ సంతోష్‌లను కలవటంతో.. అన్నామలై బీజేపీకి గుడ్ బై చెప్పనున్నారనే వార్తలు వచ్చాయి. కూడా సమర్పించారని.. అయితే బీజేపీ పెద్దలు దీనికి ఆమోదం తెలపలేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం చేసిన ట్వీట్ ఇంట్రస్టింగ్‌గా మారింది. ట్వీట్ చేశారు. "సోదరుడు, తమిళనాడు బీజేపీ నేత అన్నామలైకు పుట్టినరోజు శుభాకాంక్షలు. వివిధ అంశాలపై మీకున్న స్పష్టత, మీ దృఢ సంకల్పం, ప్రజా సేవ పట్ల మీకున్న అచంచలమైన నిబద్ధత ఎంతోమంది నుంచి ప్రశంసలు వచ్చేలా చేశాయి. మీరు ధైర్యం, ఉన్నత ఆశయం, అంకితభావంతో దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నా. మురుగన్ స్వామి మీకు మంచి ఆరోగ్యాన్ని, శారీరక బలాన్ని ప్రసాదించాలి. భవిష్యత్తులో మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ, సిద్ధుల పుణ్యభూమి అయిన తమిళనాడుకు, భారతదేశానికి.. అంతే ఉత్సాహం, నిజాయితీ, నిబద్ధతతో సేవ చేస్తూనే ఉంటారని ఆశిస్తున్నా" అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.అయితే రాబోయే రోజులలో మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా అంటూ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించటంతో.. అన్నామలై బీజేపీ నుంచి బయటకు రావటం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక అన్నామలై కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఒకట్రెండు రోజులలో బీజేపీకి రాజీనామా, కొత్త పార్టీ అంశంపై అన్నామలై నుంచి ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నడుస్తారనే ప్రచారం కూడా తమిళనాడులో జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాలు అన్నింటికి కాలమే సమాధానం చెప్పనుంది.