ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించారు. 'శుభం' తర్వాత సామ్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం.. జూన్ 19న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా దర్శక నిర్మాతలు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా స్టార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంత మాట్లాడుతూ.. ''ఉమెన్ సెంట్రిక్ జోనర్ సినిమాలంటే ఇలానే ఉండాలని అందరి మనసులో ఒక అభిప్రాయం ఉంది. ఒక సోషల్ మెసేజ్ ఉండాలి.. అమ్మాయి ఒక ఏంజెల్ లా ఉండాలి.. ఆమెలో మంచితనం, మంచి క్వాలిటీస్ ఉండాలి.. త్యాగం చేయాలి. అన్నీ పెర్ఫెక్ట్ గా ఉండాలి. మామూలుగా అలాంటి మహిళా ప్రాధాన్యత చిత్రాలే వస్తున్నాయి. ఆ సినిమాలు ఇలానే ఉండాలని మనం ఒక బ్రాకెట్ గీసి అందులో పెట్టేశాం. అది బ్రేక్ చేయాలనే నాకు ఉండేది. అంతకు మించి చేసే సమర్థత మనకు ఉంది. మేము కూడా ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయగలుగుతామనేది నా ఉద్దేశ్యం'' అని అన్నారు.* ''ఒక పెద్ద హీరో సినిమాని తీసుకుంటే, ప్రభాస్ చేయి పడితే చాలు రూ.100 కోట్లు వస్తాయి. కానీ ప్రభాస్ గారు ఫస్ట్ సినిమాకే ఆ చేయి పెట్టలేరు కదా. పదేళ్లపాటు దర్శకులు హీరోని ఎలివేట్ చేసే కథలు రాసి ఆ స్థాయికి తీసుకొచ్చారు. అతని చేయి పడితే కూడా జనాలు చచ్చిపోతారు'' అంటూ ప్రభాస్ స్టార్ డమ్ పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘మా ఇంటి బంగారం’ సినిమాలో చేయి పడే షాట్ పెట్టలేదని, మెల్లమెల్లగా మహిళా పాత్రలు కూడా ఆ రేంజ్ కి వస్తాయని, ఇప్పుడు ఫస్ట్ సినిమాకే తాను చేయి పెడితే జనాలు కొడతారని అన్నారు. ఉమెన్ సెంట్రిక్ సినిమాలు కూడా ఆ లెవెల్ కి చేరుకుంటాయని సామ్ ఆకాంక్షించారు. విజయ్ శాంతి అప్పట్లోనే అలాంటి సినిమాలు చేశారని, 'చార్లెస్ ఏంజెల్స్' లాంటి ఉమెన్ సెంట్రిక్ సినిమాలను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారని డైరెక్టర్ నందినీ రెడ్డి అన్నారు.