పసిడి ప్రియులకు మళ్లీ అదిరిపోయే శుభవార్త అందుతుంది. మళ్లీ ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇటీవల భారీ పతనం తర్వాత తగ్గుతూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ ఇటీవల పెరిగిన సంగతి తెలిసిందే. అరెరే పెరుగుతుంది ఎలా అని కొనుగోలుదారులు అనుకునే లోపే మళ్లీ ఒక్కసారిగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగగా అనిశ్చితి నెలకొంది. మరోసారి ఇరాన్ నౌకలపై అమెరికా భీకర దాడులు చేసింది. మళ్లీ యుద్ధం మొదలైనట్లే కనిపిస్తుంది. ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా ఆంక్షల్ని మళ్లీ తీసుకురాగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు ప్రస్తుతం 80 డాలర్లకు అత్యంత సమీపంలో ఉంది. క్రూడ్ ధరలు పెరగడంతో సాధారణంగానే బంగారం, వెండి వంటి లోహాలు ఆకర్షణ కోల్పోతున్నాయి. దీంతో ధరలు దిగొస్తూనే ఉన్నాయి. వరుసగా మూడోరోజు రేట్లు తగ్గగా 2 రోజుల్లో భారీ పతనం కనిపించింది.ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే గత 2 రోజుల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు విపరీతంగా తగ్గాయని చెప్పొచ్చు. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 4070 డాలర్లకు దిగొచ్చింది. కిందటి రోజు ఇది 4120 వద్ద ఉండేది. ఇక సిల్వర్ రేటు కూడా 61 డాలర్ల స్థాయి నుంచి 58 డాలర్లకు పడిపోయింది. డాలరుతో చూస్తే రూపాయి విలువ రూ. 95.55 వద్ద ఉంది.ఇక దేశీయంగా కూడా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. బుధ - గురువారం మధ్య చూస్తే 22 క్యారెట్ల పసిడి ధర తాజాగా రూ. 1950 తగ్గి హైదరాబాద్ నగరంలో ఇప్పుడు గురువారం ఉదయం 7 గంటలకు తులం రూ. 1,31,200 వద్ద ఉంది. ఇది కిందటి రోజు కూడా రూ. 1250 తగ్గింది. గత 3 రోజుల్లో చూస్తే ఏకంగా రూ. 3300 తగ్గింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 2130 తగ్గడంతో ఇది ఇప్పుడు 10 గ్రాములకు రూ. 1,43,130 వద్ద ఉంది. కిందటి రోజు ఇది రూ. 1360 తగ్గింది.బంగారం ధరల బాటలో వెండి రేట్లు కూడా పతనం అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు రూ. 5 వేలు తగ్గి ప్రస్తుతం కేజీకి రూ. 2.45 లక్షల వద్ద కొనసాగుతుంది. దీనికి ముందు జులై 6 న సిల్వర్ రేటు రూ. 10 వేలు తగ్గింది. అంతకుముందు జులై 2-3 తేదీల్లో రూ. 15 వేలు పెరిగింది.