మేల్ డామినేషన్ ఉన్న సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ స్టార్ హీరోల సినిమాల రికార్డుల గురించే అందరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ రికార్డుల గురించి మాట్లాడుకునే టైమ్ వచ్చింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం టాలీవుడ్ హిస్టరీలోనే ఓ అరుదైన మైలురాయిని అందుకోబోతోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోఓ బెంచ్ మార్కును సెట్ చేయడానికి అడుగు దూరంలో ఉంది.నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ఫ్యామిలీ కామెడీ అండ్ క్రైమ్ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’. జూన్ 19న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. మూడో వారంలోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.96.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, రూ.100 కోట్ల మైలురాయి దిశగా దూసుకెళ్తోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అదే జరిగితే సమంత తెలుగు చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. తెలుగులో ఇప్పటి దాకా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ఫీమేల్ లీడ్ మూవీ లేదు. 2018లో కీర్తి సురేష్ నటించిన 'మహానటి' సినిమా రూ.84-85 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇది తెలుగుతో పాటుగా తమిళ మలయాళ భాషల్లో విడుదలైంది. 2015లో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందిన 'రుద్రమదేవి' రూ.87 కోట్ల వరకూ గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. అలానే అనుష్క నటించిన 'అరుంధతి' (70 కోట్లు), 'భాగమతి' (65 కోట్లు) సినిమాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ సినిమా రూ.100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.ఇప్పటికే మహిళా ప్రధాన పాత్రలో వచ్చిన అతిపెద్ద తెలుగు చిత్రంగా ‘మా ఇంటి బంగారం’ న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే క్రమంలో రూ.100 కోట్ల మైల్ స్టోన్ క్లబ్ లో చేరితే.. ఈ ఘనత సాధించిన ఫీమేల్ లీడ్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసినట్లు అవుతుంది. 'లెనిన్' సినిమా రిలీజ్ అయ్యే వరకూ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పోటీ లేదు కాబట్టి, ఈ మూడు రోజుల్లో వంద కోట్ల మార్క్ టచ్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.