తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ మంగళవారం తన పుట్టినరోజును జరుపుకున్నారు. నిన్నంతా దళపతి బర్త్ డే పోస్టులతో సోషల్ మీడియా మారుమోగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ ఇద్దరు వ్యక్తులు విజయ్ కు విషెస్ చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది. వారిలో హీరోయిన్ త్రిష ఒకరైతే, మరొకరు సూపర్ స్టార్ . కాస్త లేట్ గా అయినా త్రిష శుభాకాంక్షలు చెప్పింది కానీ.. రజనీ విష్ చేస్తూ ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడంపై నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజుకి రజనీకాంత్ విషెస్ చెప్పలేదంటూ దళపతి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తలైవర్ ని తెగ ట్రోల్ చేస్తున్నారు. విజయ్ ఎన్నికల్లో గెలిచి సీఎం అవ్వడంతో రజనీ జెలసీగా ఫీల్ అవుతున్నారని, అందుకే శుభాకాంక్షలు చెప్పలేదని విమర్శించారు. ‘ధర్మన్‌’ టైటిల్‌ రివీల్‌ ఈవెంట్‌ సందర్బంగా దీనిపై ఆయన అందరికీ క్లారిటీ ఇచ్చారు. ''విజయ్ కి ఎందుకు విష్ చేయలేదు?'' అని రిపోర్టర్లు ప్రశ్నించగా.. ''నేను ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాను'' అని రజనీ బదులిచ్చారు. దీంతో రిపోర్టర్లందరూ ఆయనకు సారీ చెప్పారు. విజయ్ బర్త్ డేని పట్టించుకోలేదని ట్రోల్ చేసిన వారు సైతం, సూపర్ స్టార్ ని తప్పుగా అర్థం చేసుకున్నారని రియలైజ్ అవుతున్నారు. నిజానికి ఇటీవల కాలంలో తలైవర్ అభిమానులు, దళపతి ఫ్యాన్స్ మధ్య నెట్టింట వార్స్ జరుగుతున్నాయి. దీనికి కారణం ఎన్నికల్లో విజయ్ గెలిచిన తర్వాత తర్వాత, అందరూ అతడికి శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూ కడితే.. రజనీకాంత్ మాత్రం నిశ్శబ్దంగా ఉన్నారు. అంతటితో ఆగకుండా నేరుగా వెళ్లి ఎలక్షన్స్ లో ఓడిపోయిన మాజీ సీఎం స్టాలిన్ ను కలిశారు. అప్పటి నుంచే రజనీపై ట్రోలింగ్ మొదలైంది. అదే సమయంలో ఎయిర్ పోర్టులో విజయ్ గురించి రజనీని ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా నవ్వుతూ వెళ్లిపోవడం దళపతి అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. కేవలం ఈ వివాదంపై క్లారిటీ ఇవ్వడానికే రజనీకాంత్ ఆ మధ్య ప్రెస్ మీట్ కూడా పెట్టారు. విజయ్‌పై తనకు ఎలాంటి అసూయ లేదని, ఉంటే గింటే తన సమకాలీనుడు కమల్ హాసన్ పై ఉంటుందన్నారు. ఇప్పుడు సీఎంగా మొదటి పుట్టినరోజు జరుపుకున్న విజయ్ కు రజనీ శుభాకాంక్షలు చెప్పలేదంటూ మరోసారి ఆయనపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టనంత మాత్రాన, విషెస్ చెప్పనట్టు కాదని రజనీ సమాధానంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే, స్టేజ్ మీద మాట్లాడాలంటే ప్రస్తుతం తాను సంకోచిస్తున్నట్లు ‘ధర్మన్‌’ టైటిల్‌ రివీల్‌ ఈవెంట్‌ లో రజనీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ''. అది నాతో పాటు ఇతరులకు కూడా ఇబ్బంది కలిగిస్తోంది. మాట్లాడకపోతే.. ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతారు. మాట్లాడితే, ఇప్పుడే ఎందుకు మాట్లాడారని అంటారు. మౌనంగా ఉండొచ్చు కదా అని మరికొందరు సలహా ఇస్తారు. మనల్ని ఇష్టపడని వారికి మనం ఏం చేసినా నచ్చదని.. ఇవన్నీ విన్నాకే నాకు అర్థమైంది'' అని రజనీ అన్నారు.