: గత వారం తీవ్రమైన ఒడుదొడుకులతో భారత స్టాక్ మార్కెట్, ఇన్వెస్టర్లకు పెద్దగా లాభాలు అందించలేదు. సెన్సెక్స్ 75,415 పాయింట్లు, నిఫ్టీ 23,719 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో స్థిరపడింది. ఈ వారం మాత్రం మార్కెట్లు అత్యంత కీలకంగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రికార్డు డివిడెండ్ జోష్ అందిస్తుంటే, మరోవైపు యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల వార్తలు మార్కెట్ గమనాన్ని శాసిస్తాయి. ప్రతి ఇన్వెస్టర్ ఈ వారం గమనించాల్సిన 5 కీలకమైన అంశాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్రం ఖజానాకు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అందించింది. గత సంవత్సరం రూ. 2.69 లక్షల కోట్లతో పోలిస్తే 7 శాతం మేర అధికంగా ఉంటుంది. బడ్జెట్ అంచనాల కంటే ఇది తక్కువగా ఉంది. ఈ నిధుల బదిలీ వల్ల ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుందనే నమ్మకం ఉంది. రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా మాట్లాడుతూ 'ఈ భారీ డివిడెండ్ బదిలీ వల్ల ముందు ముందు మార్కెట్లో నగదు లభ్యత ఎలా ఉండనుంది, ప్రభుత్వ వ్యయాలు ఏ మేరకు పెరుగుతాయి అనేవి మదుపరులు నిశితంగా పరిశీలిస్తారు' అని విశ్లేషించారు.గత మూడు నెలలుగా ప్రపంచ వాణిజ్యంపై, ఆయిల్ మార్కెట్లను వణికించిన యూఎస్-ఇరాన్ యుద్ధానికి తెరపడే అవకాశాలు ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ శనివారం అందించిన ఇంటర్వ్యూలో శాంతి మధ్య చర్చలు తుది దశకు చేరినట్లు తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఇరాన్ మాత్రం అంత ఈజీగా లొంగేలా లేదు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ అంశమూ మార్కెట్లపై ప్రభావం చూపనుంది.విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నారు. 2026లో ఇప్పటి వరకు వారు ఏకంగా రూ. 2.22 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఈ నెలలో రూ. 30,374 కోట్ల అమ్మకాలు చేపట్టారు. కానీ ఇక్కడ ఒక సానుకూల విషయం ఉంది. లార్జ్‌క్యాప్ షేర్లను అమ్ముతున్నా, మిడ్ అండ్ స్మాల్‌క్యాప్ షేర్లలో కొనుగోళ్లు జరపనున్నారు. గత కొన్ని రోజులుగా రూపాయి పతనం మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆర్‌బీఐ మార్కెట్లోకి జోక్యం చేసుకోవడం క్రూడాయిల్ ధరలు తగ్గడంతో రూపాయి కాస్త కోలుకుంది. ఈ వారం సైతం రూపాయి కదలికలు నిఫ్టీ గమనాన్ని డిసైడ్ చేస్తాయని చెప్పవచ్చు.