సండే డబుల్ హెడ్డర్‌లో అసలు సిసలు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్‌లో 60 మ్యాచ్‌లు పూర్తవడం.. ఆఖరి లీగ్ వీక్ కావడంతో ప్రతి మ్యాచ్ కీలకమే. ప్రతీ జట్టూ ప్లే ఆఫ్స్ కోసమే పరుగెడుతుండటంతో ఈ సూపర్ సండే చాలా స్పెషల్‌గా మారనుంది. ఐపీఎల్ 2025 ఫైనల్ టీమ్స్‌తో పాటు ప్లే ఆఫ్స్ కోసం పోరాడుతున్న మరో రెండు జట్లు కూడా తలపడుతున్నాయి. డబుల్ హెడ్డర్ కావడంతో మధ్యాహ్నం ఒక మ్యాచ్, రాత్రి మరో మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇక రాత్రి జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లైవ్‌లు స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించనుంది. పంజాబ్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టే మొదటి జట్టుగా మారనుండగా.. పంజాబ్ కింగ్స్ ఓడిపోతే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకునే పరిస్థితికి వస్తుంది. దాంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారనుంది. పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలవగా, పంజాబ్ కింగ్స్ వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయి 13 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఆర్సీబీ తన చివరి రెండు మ్యాచ్‌లలో ఒకటి గెలిచినా ప్లే ఆఫ్స్‌కు వెళ్లనుండగా, పంజాబ్ మాత్రం చివరి రెండు మ్యాచ్‌లలో గెలిచి తీరాల్సిన పరిస్తితి. ఢిల్లీ క్యాపిటల్స్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్‌ను ఓడించి మంచి జోష్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉండగా.. చాలా రోజుల తర్వాత ఎంట్రీ ఇస్తూ రాజస్థాన్ కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకాలని చూస్తుండగా.. ఎలాగైనా విజయం సాధించి ప్లే ఆఫ్స్ సినారియోను టైట్ చేయాలని ఢిల్లీ చూస్తోంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐదో స్థానంలో ఉంది. మొత్తానికి ఈ రోజు జరిగే రెండు మ్యాచ్‌లతో ఫ్యాన్స్‌లో మంచి జోష్ రానుంది.