IRCTC Ayodhya Yatra: పవిత్ర పుణ్యక్షేత్రాలైన కాశీ విశ్వనాథుడిని, అయోధ్యలోని భవ్య రామమందిరాన్ని సందర్శించాలనుకునే భక్తులకు ఐఆర్‌సీటీసీ ఒక అద్భుతమైన గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా సాగే కాశీ తీర్థయాత్ర పేరుతో 9 రోజుల ప్రత్యేక ఆధ్యాత్మిక టూర్ ప్రకటించింది. స్టేషన్లలో బోర్డింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన ఈ యాత్ర ప్రారంభం కానుంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. టికెట్ ధరలు రూ. 16,900 నుంచే ప్రారంభమవుతున్నాయి. ఈ యాత్రకు సంబంధించి భౌరత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ సెప్టెంబర్ 9వ తేదీన తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి ప్రారంభమవుతోంది. మొదటి రోజు తిరునల్వేలి నుంచి సెప్టెంబర్ 9న ఉదయం 8 గంటలకు రైలు మొదలవుతుంది. సెప్టెంబర్ 10 ఉదయం విజయవాడ జంక్షన్ చేరుతుంది. మూడో రోజు మధ్యాహ్నానికి బిహార్ లోని గయా చేరుతుంది. అక్కడ హోటల్స్ లో స్టే ఉంటుంది. మధ్యాహ్నం మహాబోధి ఆలయ సందర్శన, రాత్రి అక్కడే బస ఉంటుంది. మధ్యాహ్నం వారణాసికి రైలు బయలుదేరుతుంది. రాత్రికి వారణాసి చేరతారు. ఐదోరోజు కాశీ విశ్వనాథుడి దర్శనం, అన్నపూర్ణ, కాశీ విశాలాక్షి, కాలభైరవ ఆలయాలను సందర్శించాలి. సాయంత్రం గంగా హారతీ చూడవచ్చు. ఆరో రోజు తెల్లవారుజామున యూపీలోని అయోధ్యకు బయలుదేరతారు. మధ్యాహ్నానికి చేరతారు. ప్రసిద్ధ రామాలయం సందర్శన ఉంటుంది. రాత్రి ప్రయాగ్ రాజ్‌కు పయనమవుతారు. త్రివేణి సంగమంలో స్నానాలు చేయాలి. రాత్రికి తిరుగు ప్రయాణం మొదలుతుంది. 8వ రోజు విజయవాడ చేరతారు. 9వ రోజు రాత్రి తమిళనాడులోని తిరునల్వేలి చేరడంతో యాత్ర ముగుస్తుంది. ప్యాకేజీ వివరాలు ఇలాఎకానమీ (స్లీపర్ క్లాస్) ఒక్కో టికెట్ ధర రూ. 16,900 ఉంటుంది. హోటల్‌లో నాన్ ఏసీ గదులు ఇస్తారు. ఒక్కో గదిలో నలుగురైదురుగు ఉండాలి. స్టాండర్డ్ 3ఏసీ టికెట్ ధర పెద్దలకు రూ. 31,000 ఉంటుంది. ఒక్కో గదిలో ఇద్దరూ లేదా ముగ్గురు ఉంటారు. కంఫర్ట్ 2ఏసీ టికెట్ ధర రూ. 43,500 ఉంటుంది. ఏసీ గదులు ఇస్తారు. ఇద్దరూ లేదా ముగ్గురు గదిని షేర్ చేసుకోవాలి.భారత్ గౌరవ్ ట్రైన్ ద్వారా కాశీ యాత్ర చేపట్టాలనుకునే భక్తులు ఐటీఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రూట్ మ్యాప్, ప్యాకేజీ వివరాలు, ప్యాకేజీలో లభించించే అంశాలు తెలుసుకోవచ్చు.