చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. కమ్‌బ్యాక్ అదుర్స్..!

Wait 5 sec.

స్టార్ షట్లర్ భారత బ్యాడ్మింటన్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ 2026 టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో క విజేతగా నిలిచింది. టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు అసాధారణ ఆటతీరును కనబరిచింది. హోమ్ క్రౌడ్ మద్దతుతో బరిలోకి దిగిన జపాన్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ 3 అకానె యామగూచిని వరుస గేమ్స్‌లో చిత్తు చేసింది. దీంతో జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ దక్కించుకుంది.గత రెండేళ్లుగా పీవీ సింధు ఫామ్‌పై, ఆమె ఆటతీరుపై క్రీడా వర్గాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమయ్యాయి. వరుస గాయాల బారిన పడటం, ఆధునిక బ్యాడ్మింటన్ ఆటలో వస్తున్న వేగవంతమైన మార్పులు, 2024లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ తర్వాత సుదీర్ఘ కాలంగా టైటిల్ కరవు ఎదుర్కోవడం వంటి సమస్యలు ఆమెను వెంటాడాయి. దీంతో సింధు మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకోగలదా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నింటికీ ఈ 31 ఏళ్ల భారత స్టార్ ప్లేయర్ తన రా పవర్, అద్భుతమైన వ్యూహాలు, మానసిక దృఢత్వంతో కూడిన ఆటతో టోక్యో కోర్టులోనే పక్కా సమాధానం ఇచ్చింది.ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచి ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. మొదటి గేమ్‌లో సింధు తనదైన శైలిలో క్రాస్ కోర్ట్ డ్రాప్స్, పవర్‌ఫుల్ స్మాష్‌లతో యామగూచి లయను దెబ్బతీసింది. ఒక దశలో స్కోరు బోర్డు ఇరువైపులా సమంగా మారుతూ ఉత్కంఠ రేపినప్పటికీ, ఒత్తిడి సమయాల్లో సింధు పట్టుదలగా నిలిచి కీలక పాయింట్లు సాధించి మొదటి గేమ్‌ను 21-17 తో కైవసం చేసుకుంది. తొలి గేమ్ గెలిచిన ఊపుతో రెండో గేమ్‌లో సింధు తన అగ్రెసివ్ ఆటను మరింత పెంచింది. జపాన్ ప్రేక్షకుల నుంచి లభిస్తున్న మద్దతుతో యామగూచి పుంజుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ, సింధు డిఫెన్స్ విభాగాన్ని ఛేదించలేకపోయింది. సింధు నెట్ ప్లే వద్ద చూపిన చాకచక్యం యామగూచిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టి తప్పులు చేసేలా చేసింది.రెండో గేమ్‌లో కూడా సింధు క్రమశిక్షణను కోల్పోకుండా ఆడి 21-17 తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత యామగూచిని ఆమె సొంత గడ్డపైనే ఓడించడం ద్వారా సింధు బ్యాడ్మింటన్ ప్రపంచానికి ఒక బలమైన సంకేతాన్ని పంపింది. తాను మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని, భవిష్యత్తు టోర్నీలకు సిద్ధంగా ఉన్నానని ఈ గెలుపు ద్వారా నిరూపించింది.