తెలంగాణ ప్రజలకు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు, ఖరీఫ్ సాగు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న రైతులకు ఇది ఉపశమనాన్ని కలిగించే వార్త. సోమవారం మధ్యాహ్నం ఈ రుతుపవన చలనాలు రాష్ట్ర దక్షిణ సరిహద్దు ప్రాంతమైన జోగులాంబ గద్వాల జిల్లాను తాకినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారికంగా వెల్లడించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించనున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత గాలుల వేగాన్ని బట్టి జూన్ 11 లేదా 12 నాటికి ఇవి హైదరాబాద్ మహా నగరానికి కూడా చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ప్రస్తుతం .. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి సమాంతరంగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత పెరగనుంది. దీనివల్ల నేడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు. జూన్ 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెద్దవీడు గ్రామంలో 11.1 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అలాగే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రాచులూరులో 8.7 సెంటీమీటర్లు, మహేశ్వరంలో 7.3 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా దామరచర్లలో 7.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రానున్న మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలలో ఎలాంటి పెద్ద మార్పులు ఉండకపోవచ్చునని.. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని అధికారులు వెల్లడించారు.తాజా వాతావరణ బులిటెన్ ప్రకారం.. రాబోయే కొన్ని గంటల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన తుఫానులు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, రూరల్ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చుట్టుముట్టే అవకాశం ఉంది. అలాగే మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మేఘాలు కమ్ముకుని వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.