ఎస్బీఐ నుంచి కొత్త స్కీమ్.. రూ. 5 వేలు ఉంటే చాలు.. ఆగస్ట్ 7 లాస్ట్ ఛాన్స్!

Wait 5 sec.

: కొత్త స్కీమ్ లాంఛ్ చేసింది. ఇదే ఎస్బీఐ నిఫ్టీ 1D రేట్ లిక్విడ్ ఈటీఎఫ్- గ్రోత్. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది ఇంకా లో రిస్క్ స్కీమ్. అంటే చాలా తక్కువ రిస్క్ ఉన్న పథకం అని చెబుతోంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ లేదా ఎన్‌ఎఫ్‌ఓ సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అయింది. ఇది ఆగస్ట్ 7 వరకు కొనసాగుతుంది. ఫండ్ యూనిట్ల కేటాయింపు తర్వాత.. 5 బిజినెస్ డేస్‌లో తిరిగి అమ్మకం, కొనుగోలు కోసం అందుబాటులో ఉంటుంది. ఈ ఎస్బీఐ కొత్త స్కీంలో చేరాలనుకుంటే.. కనీసం రూ. 5000 ఉంటే సరిపోతుంది. దీర్ఘకాలంలో రిస్క్ లేకుండా మెరుగైన రిటర్న్స్ అందించేందుకు ఈ స్కీమ్ ఉద్దేశించినట్లు తెలుస్తోంది. ఇక్కడ రిస్క్ తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.. ఇందులో కనీసం 95 శాతం, గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడి.. ట్రై పార్టీ రెపో, ప్రభుత్వ సెక్యూరిటీలు, రివర్స్ రెపో వంటి సేఫ్టీ సాధనాల్లో చేస్తుంది.ఇవన్నీ ఆర్బీఐ కింద ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక మిగతా 5 శాతం వరకు క్యాష్, క్యాష్ రిలేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్లలో పెట్టుబడి పెడుతుంది.ఈ స్కీమ్ ఫండ్ మేనేజర్‌గా జిఘ్నేష్ షా ఉన్నారు. నిఫ్టీ 1D రేట్ ఇండెక్స్.. ఈ పథకం పనితీరుకు కొలమానంగా ఉంటుంది. ఈ స్కీమ్ కింద ప్రస్తుతానికి గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఎగ్జిట్ లోడ్ నిల్ ఉంది. అంటే ఎప్పుడైనా ఇందులో నుంచి నగదు విత్‌డ్రా చేస్కొని బయటికి రావొచ్చన్నమాట. >> మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణంగా.. మంచి రాబడి వస్తుందని నిపుణులు చెబుతుంటారు. గత చరిత్రను పరిశీలిస్తే ఇది తెలుస్తుంది. అయితే.. ఎన్ఎఫ్ఓ అంటే పెట్టుబడిదారులకు మార్కెట్లో లాంఛ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పిస్తాయి. ఇక్కడ ముందుగా తక్కువ ధరకు లభిస్తాయన్న కారణంతో చాలా మంది ఆసక్తి చూపించి మంచి పెట్టుబడి ఆప్షన్‌గా చూస్తుంటారు. ఏదైనా అసెట్ మేనేజ్‌మెంట్ హౌజ్ (AMC).. పెట్టుబడిదారుల కోసం కొత్త నిధి ప్రారంభించడమే ఈ ఎన్ఎఫ్ఓ. ఇది పరిమిత కాలమే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ స్థిరమైన ధరకు యూనిట్స్ కొనుగోలు చేయొచ్చు. గమనిక: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి.. మీ పెట్టుబడి సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలు, రిస్క్‌ను పరిగణనలోకి తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి. పైన చెప్పింది కేవలం సమాచారం మాత్రమే. పెట్టుబడి సలహా కాదు. ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది