బాహుబలికి పోటీగా బరిలోకి దిగుతున్న మాస్ జాతర.. రవితేజ రిస్క్ చేస్తున్నాడా?

Wait 5 sec.

మాస్ మహారాజ్ రవితేజ సాలిడ్ హిట్టు కొట్టి చాలా కాలమైంది. ధమాకా తర్వాత సోలోగా ఆ రేంజ్ కమర్షియల్ సక్సెస్ ఒక్కటి కూడా పడలేదు. వాల్తేరు వీరయ్య హిట్టయినా ఆది మెగాస్టార్ ఖాతాలోకి వెళ్లిపోయింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి నాలుగు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్లుగా మారాయి. దీంతో ఈసారి తప్పకుండా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'మాస్ జాతర' సినిమాతో రవితేజ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.రవితేజ హీరోగా సామజవరగమన రైటర్ భాను బోగవరపు దర్శకత్వంలో 'మాస్ జాతర' సినిమా తెరకెక్కుతోంది. ఇది రవితేజ కెరీర్ లో 75వ చిత్రం. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. RT 75 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేయబడిన ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత మరో మూడు విడుదల తేదీలు ఇచ్చారు. కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ, ఇప్పటి వరకూ థియేటర్లలోకి రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మాస్ జాతర ఫైనల్ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. 'మాస్ జాతర' చిత్రాన్ని అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దసరా పండగ సందర్భంగా ప్రకటించారు. రవితేజ - హైపర్ ఆదిల మీద ఓ ఫన్నీ వీడియో చేసి మరీ సోషల్ మీడియా వేదికగా బుధవారం రిలీజ్ డేట్ చెప్పారు. దీంతో మాస్ రాజా అభిమానులు యమా ఖుషీ అయ్యారు. అయితే బాక్సాఫీస్ దగ్గర రవితేజ పెద్ద పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అదే రోజున 'బాహుబలి: ది ఎపిక్' మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతోంది. ఎస్.ఎస్. దర్శకత్వంలో హీరోగా తెరకెక్కిన విజువల్ వండర్ 'బాహుబలి'. 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కన్ క్లూజన్' అనే పేర్లతో రెండు భాగాలుగా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ రెండు పార్ట్స్ కలిపి ఒకే సినిమాగా రిలీజ్ చేయడానికి జక్కన్న ప్లాన్ చేశారు. ఏదో రీ-రిలీజ్ లా కాకుండా, కొత్త సినిమా తరహాలో ప్రాపర్ ప్లానింగ్ తో విడుదల చేస్తున్నారు. రాజమౌళి దగ్గరుండి ఎడిటింగ్ చేయించారు. లెన్త్ మరీ ఎక్కువ కాకుండా, ఆడియన్స్ కు బోర్ కొట్టకుండా కొన్ని సన్నివేశాలు, పాటలు తొలగించారు. రిలీజుకు సరిగ్గా నెల రోజులు ఉండటంతో ప్రమోషన్స్ కూడా షురూ చేస్తున్నారు.'బాహుబలి' పాత సినిమా అయినప్పటికీ, రాజమౌళి కొత్తగా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ ఎపిక్ మూవీని మరోసారి చూడాలని సినీ అభిమానులు ఇంట్రెస్ట్ గా ఉన్నారు. RRR తర్వాత దర్శకధీరుడి నుంచి మరో సినిమా రావడానికి చాలా టైమ్ ఉంది కాబట్టి, ట్రేడ్ వర్గాలు కూడా 'బాహుబలి: ది ఎపిక్' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని వేచి చూస్తున్నారు. కానీ ఇప్పుడు అదే డేట్ కి రవితేజ రావాలని నిర్ణయించుకున్నారు. హిట్టు కొట్టి తీరాల్సిన టైంలో రాజమౌళి బాహుబలితో పోటీ ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. మరి ఈసారి మాస్ రాజాకి ఎలాంటి సక్సెస్ దక్కుతుందో చూడాలి.