జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఇంజినీరింగ్‌ సీట్లు మిగిలాయ్‌.. కంప్యూటర్స్‌ సైన్స్‌లో కూడా..

Wait 5 sec.

సాధారణంగా జేఎన్‌టీయూ (JNTU) క్యాంపస్‌లో ఇంజినీరింగ్ సీటు రావడం అంటే విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఇక్కడ చదివిన వారికి మంచి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం ఉంటుంది. అందువల్ల.. ప్రతి సంవత్సరం మంచి చేస్తుంటారు. కానీ ఈసారి పరిస్థితి విచిత్రంగా మారింది. రెండో విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత కూడా జేఎన్‌టీయూ క్యాంపస్‌లో 13 కోర్సులలో 58 సీట్లు మిగిలిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సీట్లు మిగలడానికి కారణాలు.. ఈ సీట్లు మిగలడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని జేఎన్‌టీయూ అధికారులు తెలిపారు. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు చాలా మంది ఐఐటీ (IITs), ఎన్‌ఐటీ (NITs) వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో చేరారు. ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీ (IIIT), ఎన్‌ఐటీల్లో సీట్ల భర్తీ కోసం జరుగుతున్న సీ-శాట్ (C-SAT) కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత.. మూడో విడతలో ఈ ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. సంప్రదాయ కోర్సులకు పెరుగుతున్న ఆదరణ..ఈసారి ఇంజినీరింగ్ కోర్సుల్లో ఆసక్తికరమైన మార్పు కనిపించింది. గతంలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌కు ఉన్నంత డిమాండ్ ఇప్పుడు సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి వాటికి కూడా పెరుగుతోంది. జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఉన్న 693 సీట్లలో 635 మంది విద్యార్థులు ఇప్పటికే చేరారు. ఇందులో సివిల్ ఇంజినీరింగ్‌లో 66 సీట్లకు 65, మెకానికల్‌లో 66 సీట్లకు 63, ఎలక్ట్రికల్‌లో 66 సీట్లకు 57 సీట్లు భర్తీ అయ్యాయి. అలాగే.. కెమికల్, బయోటెక్నాలజీ, మెటలర్జీ ఏర్పడింది. కొన్ని ప్రైవేటు కళాశాలల్లో లక్షల రూపాయల డొనేషన్లు చెల్లించి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో చేరుతున్నప్పటికీ.. జేఎన్‌టీయూ క్యాంపస్‌లో మాత్రం కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల్లో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీనిని బట్టి విద్యార్థుల ప్రాధాన్యతలలో మార్పు కనిపిస్తోందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.