ఆమె జిల్లా కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్.. ఒక రైతు ఫిర్యాదుతో ఏసీబీకి చిక్కారిలా..

Wait 5 sec.

తీసుకుంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగిని () అధికారులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ఈ ఘటనలో జూనియర్ అసిస్టెంట్ సుజాత అనే మహిళ పట్టుబడింది. నవాబుపేట మండలం, వట్టిమీనపల్లికి చెందిన ఒక రైతు తన అసైన్‌మెంట్ భూమి రికార్డుల్లో తల్లి పేరు నమోదు చేయించడానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియలో భాగంగా.. అతడి ఫైల్ కలెక్టర్ ఆఫీసుకు చేరింది. ఈ ఫైల్‌ను కలెక్టర్ ఆమోదం పొందాక, తిరిగి తహసీల్దార్ కార్యాలయానికి పంపడానికి సుజాత అదనపు డబ్బు డిమాండ్ చేసింది. లంచం డిమాండ్, ఏసీబీ వల..ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సుజాత మొదట రూ. 5 వేలు లంచంగా తీసుకుంది. అది గూగుల్ పే ద్వారా చెల్లించాడు రైతు. తర్వాత కలెక్టర్ నుంచి అనుమతి వచ్చినా, ఫైల్‌ను తహసీల్దార్ కార్యాలయానికి పంపడానికి మరో రూ. 20 వేలు కావాలని డిమాండ్ చేసింది. చివరికి బేరం రూ. 15 వేలకు కుదిరింది. రైతు నిస్సహాయంగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు డబ్బులు ఇస్తుండగా, ఏసీబీ బృందం ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.సమస్యల పరిష్కారం, ఏసీబీ సూచనలు..ఈ ఘటన అనంతరం ఏసీబీ అధికారులు ఈ-సెక్షన్‌లో సోదాలు చేసి, అనేక ఫైళ్లను పరిశీలించారు. సుజాతను అదుపులోకి తీసుకుని.. ఈ అవినీతి వ్యవహారంలో మరెవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నిందితురాలిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, జైలుకు తరలించనున్నారు. కాదు. భూ రికార్డులు, సంక్షేమ పథకాలు, నిర్మాణ అనుమతులు వంటి వాటి కోసం చాలా మంది అధికారులు లంచాలు డిమాండ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల నిస్సహాయంగా ఉన్న సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో భయపడకుండా ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఏ అధికారి అయినా లంచం అడిగితే వెంటనే 1064 అనే ఉచిత ఫోన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ విధంగా ప్రజలు స్వయంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని అధికారులు కోరుతున్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పట్టుబడ్డారు. వీరు లంచం తీసుకుంటూ లేదా అక్రమ ఆస్తులు సంపాదించి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఏసీబీ ప్రధానంగా రెండు రకాల కేసులను విచారిస్తుంది. అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా పని కోసం ప్రజల నుంచి లంచం డిమాండ్ చేసినప్పుడు, గా పట్టుకుంటారు. మరొకటి.. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చినప్పుడు, ఏసీబీ సోదాలు నిర్వహించి, ఆ ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది.