చెట్లను నరికినందుకు.. రూ.లక్ష జరిమానా విధింపు.. ఎక్కడంటే..

Wait 5 sec.

పర్యావరణానికి చెట్లు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. కానీ కొంతమంది వాటిని నిర్లక్ష్యంగా నరికివేస్తున్నారు. ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు సిద్దిపేట పట్టణంలో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఐదు చెట్లు నరికినందుకు గాను బాధ్యులపై భారీ జరిమానా విధించారు. ఒక్కో చెట్టుకు రూ. 20 వేల చొప్పున మొత్తం రూ. లక్ష జరిమానా విధిస్తూ మున్సిపల్ కమిషనర్ అశ్రీత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో చెట్ల పాత్ర..పర్యావరణ సమతౌల్యం కాపాడడంలో చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం కారణంగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరుగుతోంది. ఇది మానవ ఆరోగ్యానికి ప్రమాదకరం. చెట్లు కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకొని, మనకు జీవనాధారమైన ప్రాణవాయువు (ఆక్సిజన్)ను అందిస్తాయి. చెట్ల నరికివేత వల్ల ఈ ప్రక్రియ దెబ్బతిని, కాలుష్యం మరింత పెరుగుతుంది. తద్వారా శ్వాసకోశ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ నష్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవహరించింది. పర్యావరణానికి హాని కలిగించే చర్యలను చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది. చెట్లు నరకడం మనిషిని చంపడం లాంటిదే అని వ్యాఖ్యానించింది. నరికితే రూ. 1 లక్ష జరిమానా విధించాలని తీర్పు చెప్పింది. ఆగ్రాలోని తాజ్ ట్రపెజియం జోన్‌లో రాత్రికి రాత్రే 454 చెట్లను నరికిన ఒక వ్యక్తి అభ్యర్థనను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు ఎంత జరిమానా విధించాలో ఈ తీర్పు ద్వారా ఒక ప్రమాణాన్ని నిర్ణయించింది. పర్యావరణానికి హాని కలిగించేవారిపై దయ చూపరాదని, కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. చెట్ల సంరక్షణ కోసం ఉద్యమాలు..భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. చెట్లను కాపాడటం కోసం జరిగిన గొప్ప ఉద్యమాల్లో ఒకటి చిప్కో ఉద్యమం. 1970లలో ఉత్తరాఖండ్‌లో మొదలైన ఈ ఉద్యమంలో గ్రామస్థులు, ముఖ్యంగా మహిళలు, చెట్లను నరకడానికి వచ్చిన వారిని అడ్డుకునేందుకు చెట్లను గట్టిగా పట్టుకొని నిలబడ్డారు. అలాగే.. గుజరాత్‌లో నర్మదా నదిపై పెద్ద డ్యామ్ కట్టడానికి వ్యతిరేకంగా జరిగిన నర్మదా బచావో ఆందోళన కూడా పర్యావరణ సంరక్షణకు ఒక ముఖ్యమైన ఉదాహరణ. ఈ ఉద్యమాలు మన దేశంలో పర్యావరణ పరిరక్షణకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేస్తున్నాయి. సిద్దిపేటలో తీసుకున్న ఈ చర్యలు భవిష్యత్తులో చెట్లను నరికేవారికి ఒక గుణపాఠంగా మారతాయి. చెట్ల ప్రాముఖ్యతను గుర్తించి, వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి.. పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.