కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు, ప్రభుత్వ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో అక్కడక్కడాఅంచనాల మధ్య అధికారులను అప్రమత్తం చేశారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి స్వయంగా పరిశీలించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వర్ష ప్రభావ ప్రాంత ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాలో గురువారం భారీ నుంచి అతి కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, విపత్తులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం, సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, NDRF, SDRF బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మరోవైపు కురిసింది. బుధవారం కురిసిన వర్షానికి విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా డ్రైనేజీలు, మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. విద్యాధరపురంలో పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరటంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ మాన్సూన్ రెస్పాన్స్ టీం , ఫ్లడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేశారు. కృష్ణానది, బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరద ముంపు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు పునరావాస కేంద్రాలకు వెంటనే తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.మరోవైపు పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం పెరగటంతో కృష్ణమ్మ నిండు కుండను తలపిస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3.45 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.