కేవలం రూ.1279కే విమాన ప్రయాణం.. ఎయిరిండియా ఫ్రీడమ్ సేల్.. ఆగస్టు 15 వరకే బుకింగ్ ఛాన్స్!

Wait 5 sec.

Flight Ticket: భారత దేశ 79వ స్వాంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్పెషల్ టికెట్ ధరలతో ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. కేవలం బస్ టికెట్ రేటుతో విమాన ప్రయాణం కల్పిస్తోంది. ఎంపిక చేసిన మార్గాల్లో ఏకంగా 50 లక్షల సీట్లు ఈ ప్రత్యేక సేల్ కోసం కేటాయించింది. తరుచూ విమాన ప్రయాణాలు చేసే వారితో పాటుగా ఒక్కసారైనా విమాన ఎక్కాలని కలలుగనే వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. కేవలం రూ.1279కే దేశీయ మార్గాల్లో ఫ్లైట్ జర్నీ కల్పిస్తోంది. అలాగే అంతర్జాతీయ మార్గాల్లో అయితే రూ.4279కే విమాన ప్రయాణం చేయవచ్చు. మొత్తం 50 లక్షల సీట్లు ఈ ఫ్రీడమ్ సేల్ కోసం కేటాయించారు. ఈ ప్రత్యేక ఫ్రీడమ్ సేల్ టికెట్ల బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఆగస్టు 15, 2025 రోజున అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ సమయంలో బుకింగ్ చేసుకుని ఆగస్టు 19, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. వచ్చే శీతాకాలం, వేసవి కాలంలో ఏదైనా టూర్ వెళ్లాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. దీపావళి, దుర్గాపూజ, ఓనం, క్రిస్మస్ వంటి పండుగల సమయంలో ప్రయాణాలు చేసేందుకు ఈ ఫ్రీడమ్ సేల్ అనువగా ఉంటుందని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. పూర్తి వివరాల కోసం తమ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చని తెలిపింది. టికెట్లు బుకింగ్‌కి ప్రయాణానికి కనీసం నాలుగు రోజుల వ్యవధి ఉండాలని తెలిపింది. ఎక్స్‌ప్రెస్ లైట్ ద్వారా తక్కువ ధరకే ఎలాంటి బ్యాగేజ్ చెకిన్ ఇన్ లేకుండా ఎంట్రీ కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఎవరైనా చెక్ ఇన్ బ్యాగేజ్ ఎంచుకుంటే ఎక్స్‌ప్రెస్ వాల్యూ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని, ఈ ధరలు దేశీయంగా రూ.1379 నుంచి మొదలవుతుండగా అంతర్జాతీయ మార్గాల్లో రూ.4479 నుంచి ప్రారంభమవుతున్నట్లు తెలిపింది. అలాగే మరింత సౌకర్యవంతమైన జర్నీ కోసం ఎక్స్‌ప్రెస్ బిజన్ ఆప్షన్ ఎంచుకోవచ్చని తెలిపింది. దీని ద్వారా ప్రీమియం క్యాబిన్ అనుభవంతో 58 అంగుళాల సీట్లు ఉంటాయని తెలిపింది. ఈ ఆప్షన్ 40కి పైగా విమానాల్లో అందుబాటులో ఉందని తెలిపింది. అదనపు ప్రయోజనాలు.. లాయాల్టీ ప్రోగ్రామ్ సబ్‌స్క్రైబర్లకు అదనపు బెనిఫిట్స్ కల్పిస్తోంది. ఎక్స్‌ప్రెస్ బిజ్ ధరలపై 25 శాతం డిస్కౌంట్, బ్యాగేజ్ ఛార్జీలు, హాట్ మీల్స్, గౌర్మెయిర్ సీట్ ఎంపిక వంటి వాటిపై 20 శాతం అదనపు తగ్గింపు కల్పిస్తున్నట్లు తెలిపింది. అలాగే విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, సాయుధ దళాల సిబ్బందికి ప్రత్యేక తగ్గింపును కొనసాగిస్తున్నట్లు తెలిపింది.