ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. వరుసగా 4 రోజులు, ఫుల్ లిస్ట్ ఇదే

Wait 5 sec.

ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.. రోడ్లు నదుల్లా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు కూడా వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో వర్షాలతో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అప్రమత్తమయ్యారు. ఇవాళ జిల్లాలోని అన్ని స్కూల్స్, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అవసరం లేకపోతే బయటకు రావద్దని ఆమె సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాలు, వరదల్ని బట్టి స్కూళ్లకు, విద్యా సంస్థలకు సెలవులపై నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే పలు జిల్లాల్లో వర్షాల దెబ్బకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి.ఆగష్టు 15, ఆగష్టు 16, ఆగష్టు 17న వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఆగష్టు 15వ తేదీ శుక్రవారం కావడంతో స్వాతంత్ర్య దినోత్సవం సెలవుగా ఉంది. ఆ తరువాత ఆగష్టు 16వ తేదీ శనివారం శ్రీకృష్ణాష్టమి సెలవు వచ్చింది. ఇక ఆగష్టు 17వ తేదీ ఆదివారం కావడంతో మరో సెలవు వచ్చింది. అంటే విద్యార్థులకు ఆదివారం వరకు సెలవులు ఉన్నాయి.. మళ్లీ సోమవారం నుంచి స్కూళ్లు, విద్యా సంస్థలు ప్రారంభం అవుతాయి. ఈ నెల 24న ఆదివారం సెలవు కాగా ఈ నెల 27న వినాయక చవితి సెలవు దినం.. ఈ నెల 31న ఆదివారం వచ్చింది. మొత్తంగా చూస్తే వచ్చాయి. వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 8వ తేదీ వరలక్ష్మి వ్రతం కావడంతో సెలవు ప్రకటించారు. అలాగే ఆగస్ట్ 9న రాఖీ పౌర్ణమి కావడం, రెండో శనివారం కూడా వచ్చింది. అలాగే ఆగస్ట్ 10వ తేదీ ఆదివారం సెలవు కావడంతో.. ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. ఈ నెలలో విద్యార్థులకు కేవలం మూడు వారాలు మాత్రమే స్కూళ్లు, విద్యా సంస్థలు జరిగాయి. ఈ వర్షాల కారణంగా మరో ఒకటి, రెండు సెలవులు వచ్చాయి.. మొత్తానికి ఏపీలో విద్యార్థులు వరుసగాసెలవులతో పండగ చేసుకున్నారు.