ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త.. వారందరికి జీతాలు పెంచారు, రూ.14,820 వరకు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుల్లో పనిచేసే మసాల్చీల దినసరి వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు రూ.300 నుంచి రూ.570కి పెంచుతూ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ప్రకటనలో తెలిపారు. చాలా కాలంగా ఉన్న ని.. నెలలో 26 రోజుల వరకు వేతనం వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మసాల్చీలు కోర్టు ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుతారు.. అలాగే చిన్న చిన్న సహాయక పనులు చేస్తారు. కొంతకాలంగా వారు వేతనం పెంచాలని కోరుతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం వారి కష్టాన్ని గుర్తించి . ఇక నుంచి మసాల్చీలు నెలకు దాదాపు రూ.14,820 వరకు వేతనం పొందుతారు. ఈ మేరకు ప్రభుత్వం జీతం పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై మసాల్చీలు సంతోషం వ్యక్తం చేశారు. కోర్టుల ప్రాంగణాల్లో వివిధ సహాయ పనులు చేసే మసాల్చీలు దీర్ఘకాలంగా వేతన సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు రాష్ట్రప్రభుత్వం పరిష్కరించింది' అని మంత్రి ఫరూక్ తెలిపారు. మొత్తానికి కోర్టుల్లో పనిచేసే మసాల్చీల కష్టాలు తీరాయి. ఏపీ ప్రభుత్వం మరికొన్ని కీలకమైన అప్డేట్స్ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఉద్యోగ నియామకాల్లో భాగంగా క్రీడల కోటా కింద అభ్యర్థులు సమర్పించిన ధ్రువపత్రాల పరిశీలన జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టింది. ఒకవేళ దీనిపై అభ్యంతరాలు ఉంటే.. వారు ఈ నెల 21లోగా తెలియజేయాలని కార్యదర్శి రాజబాబు ఓ ప్రకటనలో కోరారు. గడువు ముగిసిన అనంతరం జాబితాను ‘శాప్‌’కు పంపిస్తారు. దానిని రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించిన అనంతరం తుది జాబితా ఖరారవుతుంది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం గ్రూప్‌-1 ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ వెల్లడిస్తుంది. మరోవైపు హైకోర్టు ఆదేశాల దృష్ట్యా డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (నోటిఫికేషన్‌ నంబరు 14/2023), ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్‌ (11/2024) నియామకాల తుది జాబితా ప్రకటనను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో బుధవారం పేర్కొంది. ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్‌ల పాటింపు అంశంపై హైకోర్టులో విచారణ సాగుతోంది. ఇదిలా ఉంటే.. 'ఐటీఐ ఒకేషనల్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు నేరుగా పాలిటెక్నిక్‌ సెకండియర్‌లో చేరేందుకు స్పాట్‌ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రక్రియ ఈ నెల 19వ తేదీన నిర్వహించి, స్పాట్‌ అడ్మిషన్ల జాబితాను స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌బీటీఈటీ)కి 21వ తేదీలోగా పంపాలని ప్రతి జిల్లాలోని నోడల్‌ ప్రిన్సిపాళ్లకు ఆదేశాలను జారీ చేసింది. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 24వ తేదీలోగా ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది' అని సాంకేతిక విద్యా మండలి ఒక ప్రకటనలో తెలిపింది.