ఏపీ మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం రూపాయి కట్టక్కర్లేదు.. ఆ డబ్బు నేరుగా అకౌంట్‌‌లోకి

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద ఇస్తున్న ఉచిత సిలిండర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి లబ్ధిదారులు కింద అందించే ఉచిత సిలిండర్‌కు ముందే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. బుక్‌ చేసుకుంటే చాలు.. వెంటనే సిలిండర్ రాయితీ డబ్బుల్ని బ్యాంకు అకౌంట్‌లలో జమ చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే గతంలో లబ్ధిదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డబ్బులు చెల్లిస్తే.. ఆ తర్వాత రాయితీ డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లో జమ చేశారు. ఇకపై అలా కాకుండా గ్యాస్ బుక్ చేసుకుంటే సరిపోతుంది.. ముందుగా రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.ఈ మేరకు ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని ఆరు గ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో అమలు చేస్తోంది. అక్కడ కనుక ఈ కొత్త ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రమంతా అమలు చేయాలని ఆలోచన చేస్తోంది. కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు రావాలంటే.. అర్హత ఉన్న వారు గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకుని మొత్తం డబ్బులు ముందుగానే చెల్లించేవారు.. అయితే తర్వాత కొన్ని రోజులకు సబ్సిడీ కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బులు బ్యాంక్‌కు జమ చేసింది. ఇప్పుడు ఆ పద్ధతిని మార్చి సిలిండర్‌ బుక్‌ చేసిన వెంటనే.. లబ్ధిదారుల డిజిటల్‌ వాలెట్‌లోకి రాయితీ డబ్బుులు జమ చేస్తారు. ఆ తర్వాత ఆ డబ్బుల్ని గ్యాస్‌ ఏజెన్సీలకు చెల్లించవచ్చు. కేంద్రం పరిధిలోని గ్యాస్‌ ఏజెన్సీల సహకారంతో ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టు చేపట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ నిర్ణయంతో మహిళకు కొంతేమర ఊరట దక్కనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ పథకం గతేడాది నుంచి అమలు చేస్తున్నారు. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గ్యాస్ సిలిండర్ల రాయితీ డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లలో జమ కావడం ఆలస్యం కావడంపై లబ్ధిదారులు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా.. రాయితీ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్‌లకు జమ చేయాలనుకుంటోంది. మరి ఈ కొత్త విధానం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అయితే ఈ విధానంతో లాభాలు అయితే ఉంటాయంటున్నారు.