Billionaires: భారత్‌లోని సంపన్న వ్యాపారవేత్తలు గత ఆర్థిక సంవత్సరం 2025లో స్టాక్ ర్యాలీలు, ఐపీఓ లాభాలతో పాటు డివిడెండ్ల రూపంలోనూ భారీగా ఆదాయం పొందారు. అంబానీలు, అదానీలతో పాటు దేశంలో అత్యంత శక్తిమంతమైన టాప్ 10 ప్రమోటర్స్ మొత్తంగా రూ. 40,000 కోట్లకుపైగా డివిడెండ్ ఆదాయాన్ని పొందినట్లు ఓ నివేదిక తెలిపింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఫౌండర్ శివ్ నాడార్ అత్యధికంగా అందుకున్నట్లు పేర్కొంది. మరి ఒక్కొక్కరు ఎంత అందుకున్నారో తెలుసుకుందాం. శివ్ నాడార్‌కు భారీ లాభంహెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ శివ్ నాడార్ 2025 ఆర్థిక ఏడాదిలో అత్యధికంగా రూ. 9,902 కోట్ల మేర డివిడెండ్ ఆదాయం అందుకున్నారు. హెచ్‌సీఎల్ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 60 డివిడెండ్ చొప్పున మొత్తం రూ. 16,290 కోట్లు చెల్లించింది. దీంతో కంపెనీలో 60.81 శాతం వాటా కలిగి ఉన్న నాడార్ కుటుంబానికి భారీగా డివిడెండ్ ఆదాయం లభించింది.అనిల్ అగర్వాల్‌వేదాంత కంపెనీ అధినేత అనిల్ అగర్వాల్ కుటుంబం గత ఏడాది రూ. 9,591 కోట్ల డివిడెండ్ అందుకుంది. వేదాంత గ్రూప్ మొత్తం రూ. 17,009 కోట్ల డివిడెండ్‌ చెల్లించిన సంగతి తెలిసిందే. అగర్వాల్ కుటుంబం వేదాంత సంస్థలో 56.38 శాతం వాటా కలిగి ఉండడంతో పెద్ద మొత్తంలో డివిడెండ్ అందుకుంది. విప్రో అజీం ప్రేమ్‌జీవిప్రో వ్యవస్థాపకుడు, బిలియనీర్ అజీం ప్రేమ్‌జీ కుటుంబం డివిడెండ్ రూపంలో ఏకంగా రూ. 4,570 కోట్లు ఆదాయాన్ని పొందింది. విప్రో ఒక్కో షేరుకు రూ. 6 చొప్పున డివిడెండ్‌ చెల్లించింది. ప్రేమ్‌జీ కుటుంబానికి విప్రోలో 72.66 శాతం వాటా ఉంది.అంబానీలకు ఆర్ఐఎల్ మొత్తం రూ. 7,443 కోట్ల డివిడెండ్‌ చెల్లించింది. ఆర్ఐఎల్‌లో అంబానీలకు 50.11 శాతం వాటా ఉంది.ఎంఏ మూపెన్‌కుఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ ప్రమోటర్ ఎంఏ మూపెన్ గత ఆర్థిక సంవత్సరం ఏకంగా రూ. 2,469 కోట్ల డివిడెండ్ అందుకున్నారు. ఒక్కో షేరుకు రూ. 118 చొప్పున డివిడెండ్‌ చెల్లించారు. సునీల్ భారతి మిట్టల్ సునీల్ భారతి మిట్టల్ కుటుంబం భారతి ఎయిర్‌టెల్ కంపెనీ నుంచి రూ. 2,357 కోట్ల మేర డివిడెండ్ పొందింది. ఎయిర్‌టెల్ సంస్థ ఒక్కో షేరుకు రూ. 16 చొప్పున డివిడెండ్‌ చెల్లించింది.ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నందన్ నీలేకణి, ఎస్‌డీ శిబులాల్, ఎస్ గోపాలకృష్ణన్, కే దినేష్, నారాయణ మూర్తి కలిపి మొత్తం రూ. 2,331 కోట్ల డివిడెండ్ ఆదాయం సంపాదించారు. ఇన్ఫోసిస్ రూ. 17,854 కోట్ల మేర డివిడెండ్‌ చెల్లిచింది. దిలీప్ షాంఘ్వీసన్ ఫార్మా వ్యవస్థాపకులు దిలీప్ షాంఘ్వీ గత సంవత్సరం రూ. 2,091 కోట్ల మేర డివిడెండ్ ఆదాయం అందుకున్నారు. సన్ ఫార్మా కంపెనీ మొత్తంగా రూ. 3,839 కోట్ల డివిడెండ్‌ ప్రకటించగా అందులో ఎక్కువ భాగం షాంఘ్వీ కుటుంబానికే వెళ్లింది. బజాజ్ గ్రూప్ బజాజ్ గ్రూప్ ప్రమోటర్లు గత సంవత్సరంలో ఏకంగా రూ. 1,645 కోట్ల డివిడెండ్ అందుకున్నారు. బజాజ్ ఆటో ఒక్కో షేరుకు రూ. 210 డివిడెండ్ చెల్లించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ అదానీ పోర్ట్స్ & సెజ్ నుంచే ఏకంగా రూ. 996 కోట్లు రావడం గమనార్హం.