తిరుమలలో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే.. టీటీడీ సిబ్బందిపై నోటి దురుసు, ఆ రూల్ కూడా తెలియదా!

Wait 5 sec.

తిరుమలలో టీడీపీ ఎమ్మెల్యే హంగామా చేశారు.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే వీఎం థామస్ టీటీడీ ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. ఆయన తన అనుచరులను ప్రొటోకాల్ దర్శనానికి అనుమతించాలని కోరారు. టీటీడీ సిబ్బంది నిబంధనల ప్రకారం జనరల్ బ్రేక్ దర్శనం టికెట్లు ఉన్నవారిని అనుమతించలేమని చెప్పడంతో వివాదం రేగింది. ఆదివారం ఎమ్మెల్యే థామస్ పది మందితో శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆయన ప్రొటోకాల్ దర్శనం కోసం వచ్చారు.. అయితే, ఆయన వెంట జనరల్ బ్రేక్ దర్శనం టికెట్లు ఉన్న ఆరుగురు అనుచరులు కూడా ఉన్నారు. వీరందరినీ ప్రొటోకాల్ దర్శనానికి అనుమతించాలని ఎమ్మెల్యే కోరారు. క్యూకాంప్లెక్స్-1 వద్ద విధుల్లో ఉన్న టీటీడీ ఉద్యోగులు దీనికి అంగీకరించలేదు. జనరల్ బ్రేక్ టికెట్లు ఉన్నవారిని ప్రొటోకాల్ దర్శనానికి పంపడం కుదరదని వారు స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యే ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. అయినా ఎమ్మెల్యే తన అనుచరులను ఆలయం వరకు తీసుకెళ్లారు. వెంటనే అక్కడే ఉన్న ఉన్నతాధికారులు వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే థామస్ టీటీడీ అధికారుల్ని కూడా దుర్భాషలాడారు. చివరికి టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఏవీఎస్‌వో అక్కడికి వచ్చారు. మాత్రమే దర్శనం సాధ్యమని ఎమ్మెల్యేకు తేల్చా చెప్పారు. ప్రొటోకాల్‌లో పంపడం కుదరదన్నారు.. దీంతో జనరల్‌ బ్రేక్‌లోనే ఎమ్మెల్యే వెంట వచ్చిన వారిని దర్శనానికి అనుమతించారు.అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో జూన్ 07 నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.పుష్పయాగంఇందులో భాగంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారికి స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ముందుగా పుష్పయాగం కోసం వినియోగించే పుష్పాలను ఆలయంలో మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ప్రదక్షిణగా వెళ్లి మాడ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారిని కొలువుతీర్చారు.మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 5 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో పుష్పయాగం నిర్వహించారు. ఒక టన్ను పుష్పాలను ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి టిటిడి సరఫరా చేసింది. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఆ తరువాత వీధి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీవాణి, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.